"అల్వాల్ ఫైర్ స్టేషన్‌కు గ్రీన్ సిగ్నల్ దిశగా అడుగులు.. అధికారులతో ఎమ్మెల్యే చర్చలు.|

0
208

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా : నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు మరింత వేగం తీసుకురావాలనే లక్ష్యంతో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గురువారం మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. 

ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులపై ప్రత్యేక వినతిపత్రాలను అందజేశారు.

అల్వాల్ ప్రాంత ప్రజల భద్రతకు అత్యంత అవసరమైన ఫైర్ స్టేషన్ నిర్మాణ అంశాన్ని ఎమ్మెల్యే ప్రధానంగా ప్రస్తావించారు. 

అల్వాల్ గ్రామ కంఠం స్థలంలో 11 గుంటల భూమిని ఫైర్ స్టేషన్ కోసం కేటాయించే ప్రక్రియకు సంబంధించిన ఎమ్మార్వో లేఖలు, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదించిన తీర్మాన పత్రాలను కమిషనర్‌కు అందజేశారు. 

ఫైర్ స్టేషన్ నిర్మాణంపై నెలకొన్న అపోహలను తొలగించి, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పనులను వేగవంతం చేయాలని కోరారు.

అదేవిధంగా చాణిక్యపురి పార్క్ అభివృద్ధి, నియోజకవర్గంలోని పార్కులను ఆధునీకరించి ఓపెన్ జిమ్‌ల ఏర్పాటు, బండ చెరువు అభివృద్ధి, చెరువులకు సంబంధించిన న్యాయపరమైన వివాదాల పరిష్కారం అనంతరం అభివృద్ధి పనుల ప్రారంభం, పలు కాలనీల్లో బాక్స్ డ్రైన్లు మరియు సీసీ రోడ్ల నిర్మాణం, అలాగే ఆర్కేఎచ్ కాలనీలోని పార్కు స్థల పరిరక్షణ వంటి అంశాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ఎమ్మెల్యే ప్రతిపాదించిన అభివృద్ధి కార్యక్రమాలపై కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి సానుకూలంగా స్పందించారు. 

సంబంధిత అంశాలను సమగ్రంగా పరిశీలించి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో ఎంఎంసీ చీఫ్ ఇంజనీర్ అశోక్ రెడ్డి, ఇంజనీరింగ్ ప్రాజెక్టు అధికారులు, మాజీ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రభుత్వ పథకాలను ప్రజల్లేకి తీసుకువెళ్లడమే మా ముఖ్య ఉద్దేశం రాయచోటి నియోజకవర్గం ఐటీడీపీ అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి
రామాపురం మండలం రాసపల్లి గ్రామంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు లక్ష్మీ ప్రసాద్...
By Benguluri Madhubabu 2026-03-18 06:15:05 0 205
Prop News
India’s Real Estate Needs a New Standard. Propiinn Delivers It.
The Problem We’re Solving: Why India Needs a Platform Like Propiinn The Indian real estate...
By Bharat Aawaz 2025-06-25 18:49:01 0 2K
Andhra Pradesh
భగత్ సింగ్ కాలనీలో పోలీస్ సిబ్బంది వారి కార్డెన్ సెర్చ్ సెర్చ్
పుంగునూరు పట్టణం భగత్ సింగ్ కాలనీలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు సీఐ సుబ్బారాయుడు,...
By Kothuru Murali 2025-12-29 13:34:28 0 183
Telangana
అక్రమ బియ్యం దందాకు బ్రేక్.. పీడీ చట్టంతో చెక్.|
● పలుమార్లు కేసులు నమోదైన వ్యక్తిపై నిర్బంధ ఉత్తర్వులు ● అల్వాల్ పోలీసుల చర్యలు.. చర్లపల్లి...
By Sidhu Maroju 2026-07-22 15:02:41 0 26
Andhra Pradesh
రోడ్డు నందు వేరు శెనగ కాయలు వ్యాపారం
విశాఖ పట్నం కలెక్టర్ కార్యలయం ముందు రోడ్డు నందు ఓ భార్య భర్తలు వేరు శెనగ కాయలు ఉదయం11గంటలు నుండి...
By Mobbu Venkatramana 2026-01-23 11:49:46 0 557
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com