ఆసిఫాబాద్ దస్నాపూర్ అగ్నిప్రమాద బాధితులకు కాంగ్రెస్ అండ – డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క భరోసా

0
274

🎤భరత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ఆసిఫాబాద్ పట్టణ పరిధిలోని దస్నాపూర్ కాలనీలో గత అర్ధరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాద బాధితులను కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క గురువారం నాడు పరామర్శించారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఆమె, కాలిపోయిన ఇళ్లను మరియు సర్వస్వం కోల్పోయిన కుటుంబాల పరిస్థితిని స్వయంగా పరిశీలించి, బాధితులకు ధైర్యం చెప్పారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల వెంటే ఉంటుందని భరోసా ఇస్తూ, ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలకు ఆమె తన వంతుగా తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అదేవిధంగా, ఇళ్లు కాలిపోయిన బాధితులందరికీ ప్రభుత్వ పరంగా ఇందిరమ్మ ఇళ్లను ప్రత్యేకంగా మంజూరు చేయిస్తామని గట్టి హామీ ఇచ్చారు. బాధితులకు ప్రభుత్వ సహాయ సహకారాలు త్వరగా అందేలా ఉన్నతాధికారులతో మాట్లాడుతానని, కాంగ్రెస్ ప్రభుత్వం బాధితులకు పూర్తి అండగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఇరుకుల మంగ, డీసీసీ ఉపాధ్యక్షుడు తరిఖ్, డైరెక్టర్ మారుతి పటేల్, కౌన్సిలర్ వైరాగడే గోవింద్, మాజీ ఎంపీటీసీ సిడాం తిరుపతి, కాంగ్రెస్ నాయకులు ఇల్లూరి రాము, మెంగ్రే మోహన్, హరికృష్ణ, వైరాగడే సాయి, మర్రి బాలు, జాడి ప్రసాద్, జాడి తిరుపతి, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎలగలా సాయి, కమలనాథ్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ శ్రీకాంత్, గెడం శ్రీధర్ మరియు స్థానిక కాలనీ వాసులు పాల్గొన్నారు.ఈ

Search
Categories
Read More
Andhra Pradesh
భూముల ఆక్రమణపై ఏఐసీసీకి ఫిర్యాదు..
కాంగ్రెస్ ప్రభుత్వం 1991లో మల్లంపేట నిరుపేద రైతులకు కేటాయించిన సాగు భూములను కొందరు పెద్దలు...
By Boiena Rajesh 2026-02-26 15:41:49 0 214
Andhra Pradesh
గుడివాడలో పర్యటించిన ఎమ్మెల్యే రాము
*కూటమి ప్రభుత్వ పాలనలో.... గుడివాడలో స్పష్టమైన మార్పు తీసుకొచ్చాం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*...
By Rajini Kumari 2026-01-12 13:56:55 0 176
Andhra Pradesh
తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం గారి జన్మదిన వేడుకలు
21.12.2025 తాడేప‌ల్లి    - జ‌నం త‌ల‌రాత‌లు మార్చే...
By Rajini Kumari 2025-12-21 08:45:59 0 194
Business & Finance
₹369 Crore Projects to Boost Uttarakhand's Rural Economy
Union Agriculture Minister Shivraj Singh Chouhan launched 41 agriculture and rural development...
By Navya Sree 2026-07-01 06:23:36 0 99
Telangana
హైదరాబాద్ మెట్రో రైల్‌ను ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేసింది?
మెట్రో మొదటి దశలో 69 కిలోమీటర్ల నెట్‌వర్క్‌ను సుమారు రూ.22వేల కోట్లతో పీపీపీ పద్ధతిలో...
By Ponnala Srinivasrao 2026-05-02 02:32:39 0 121
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com