ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరిన అంగన్వాడీ కేంద్రం: భయాందోళనలో పిల్లల తల్లిదండ్రులు!

0
189

చింతూరు మండలం రత్నపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం భవన నిర్మాణం గత 10 సంవత్సరాలుగా అసంపూర్తిగానే మిగిలిపోయింది. కనీసం ప్రారంభోత్సవానికి కూడా నోచుకోకముందే ఈ భవనం ప్రస్తుతం పూర్తి శిథిలావస్థకు చేరుకుంది. స్లాబ్ పెచ్చులు ఊడిపోతుండటం, వర్షం వస్తే నీరంతా లోపలికి కారుతుండటంతో ఈ కేంద్రం ఎప్పుడు కూలిపోతుందోనని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.భవనానికి సంబంధించిన బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ పనులను మధ్యలోనే నిలిపివేశారు. తలుపులు, కిటికీలు సరిగ్గా అమర్చకపోవడం వల్ల అంగన్వాడీ కేంద్రంలో ఉంచే పాలు, గుడ్లు, చిక్కి వంటి చిన్నపిల్లల పోషకాహార పదార్థాలకు కనీస భద్రత లేకుండా పోతోందని అంగన్వాడీ టీచర్ లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు ఫోటో లో కనిపిస్తున్నట్లుగా భవనం తలుపులు, కిటికీలు లేకుండా అసంపూర్తిగా ఉంది. పసిపిల్లలు ఉండే ఈ కేంద్రంలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోననే భయంతో, తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడికి పంపించడానికి తీవ్రంగా భయపడుతున్నారు.చిన్న పిల్లల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఈ తీవ్రమైన సమస్యపై జిల్లా ఉన్నతాధికారులు మరియు సంబంధిత శాఖాధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పెండింగ్ బిల్లులను క్లియర్ చేసి, భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని లేదా గ్రామస్థులు కోరుతున్నారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Telangana
అయ్యప్పల పాదయాత్ర- ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని
సికింద్రాబాద్ : అయ్యప్ప స్వామి మాలధారణ ఎన్నో జన్మల పుణ్యఫలం అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2025-10-17 11:05:03 0 277
Business & Finance
Build a Thriving Producer Company
Empower farmers and primary producers by registering a Producer Company with expert guidance. A...
By Navya Sree 2026-07-11 05:39:00 0 48
Uttar Pradesh
UP Goes Hybrid: New 2-Day Work-from-Home Policy Unveiled
In a landmark move to foster energy conservation and modern work culture, CM Yogi Adityanath has...
By Dunna Jessicaruth 2026-05-14 08:49:41 0 114
Andhra Pradesh
రేపు వేమూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన... వివరాలు ఇవిగో!
ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 'మీ భూమి-మీ...
By Pagadala Venkateswar 2026-04-08 14:03:14 0 136
Andhra Pradesh
చంద్రబాబు- లోకేష్ తగిన మూల్యం చెల్లించుకునేంతవరకు వదిలిపెట్టను. -సమాజం తలదించుకునేలా రాష్ట్రంలో కూటమి పాలన. -ముద్రగడ కాపు జాతిలో పుట్టినందుకు జాతి యావత్తు గర్వపడాలి. -ముద్రగడ నివాసంలో వైసిపి నాయకులు అంబటి రాంబాబు.
కిర్లంపూడి,మార్చి 26:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,మంత్రి నారా లోకేష్ తగిన మూల్యం...
By Nandika Jayababu 2026-03-26 16:29:27 0 410
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com