AP Capital Amaravati : ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత.. బిల్లును సిద్ధం చేసిన కేంద్రం?

0
428

Amaravati Capital : రాజధానిగా అమరావతికి చట్టబద్ధత సిద్ధం చేస్తున్న కేంద్రం. ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు వచ్చే అవకాశం. 2024 జూన్ 2తో ముగిసిన ఉమ్మడి రాజధాని గడువు ముగిసింది.Amaravati Capital: ఈనెల 28 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఈ సమావేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధతను తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం అవుతోంది. కేబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు కేంద్రం సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే 10 ఏళ్లు 2 రాష్ట్రాలకు రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు 2024 జూన్ 2వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. అయితే రెండేళ్లు కావస్తున్నా ఇంకా దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అప్పుడు 2024 జూన్ 2 నుంచే రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.రాజధాని ఎంపిక ప్రక్రియ, నిర్మాణాలపై కేంద్రానికి నోట్ అందజేసింది. ఏ తేదీ నుంచి రాజధానిగా ప్రకటించాలో కేంద్ర హోంశాఖ చెప్పాలని అంది. ఈ క్రమంలో 2024 జూన్ 2 నుంచే రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సంబంధిత కేంద్ర శాఖల నుంచి హోంశాఖ అభిప్రాయాలు కోరడంతో పలు మంత్రిత్వ శాఖలు ఇప్పటికే తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. పట్టణాభివృద్ధి, న్యాయ శాఖలు ఇంకా అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం ఉందంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే రాజధాని ప్రకటించేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే ముందు కేబినెట్‌లో చర్చించి ఆమోదించనుంది. ఈ మేరకు కేబినెట్ నోట్ తయారీలో హోంశాఖ నిమగ్నమైందని అధికారులు చెప్పారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Jagan Mohan Reddy: జగన్ పరామర్శ యాత్రలో విషాదం.. జోగి రమేశ్ ఇంటి సమీపంలో వైసీపీ నేత మృతి.
Jagan Mohan Reddy: జగన్ పరామర్శ యాత్రలో విషాదం.. జోగి రమేశ్ ఇంటి సమీపంలో వైసీపీ నేత మృతి...
By Pagadala Venkateswar 2026-02-06 13:18:38 0 126
Andhra Pradesh
ఏపీ ఈగల్ చీఫ్ ఐ జి పి శ్రీ ఆర్కే రవికృష్ణ ఐపీఎస్ గారు గుంటూరు తక్కెళ్ళపాడు సిబార్ డెంటల్ కాలేజీలో డ్రగ్స్ అవగాహన సదస్సు విద్యార్థులకు తెలియజేశారు.
  >కేవీస్సార్. కోటేశ్వరరావు. గుంటూరు.   🇮🇳🇮🇳🇮🇳 *దేశాన్ని ప్రేమించే వాళ్లు...
By KOTESWARARAO KVSR 2026-01-10 15:35:19 0 417
Andhra Pradesh
టీటీడీ లడ్డు కల్తీ వాస్తవం జనసేన అధ్యక్షులు వాసు
టీటీడీ లడ్డులు కల్తీ చేసింది వాస్తవం: జనసేన పార్టీ రాష్ట్ర  కార్యదర్శులు అమ్మిశెట్టి వాసు,...
By Rajini Kumari 2026-02-07 11:45:07 0 111
Andhra Pradesh
అమరావతిలో చంద్రబాబును కలిసిన టిడిపి నాయకులు
గురువారం అమరావతిలోని సచివాలయంలో పుంగనూరు టీడీపీ నేత వెంకటరమణ రాజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును...
By Kothuru Murali 2025-12-26 06:13:47 0 167
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com