చింతకోళ్ల వాసుల దాహం తీర్చిన ఎమ్మెల్యే బుద్ధా ప్రసాద్

0
144

**చింతకోళ్ల వాసుల దాహం తీర్చిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్*

 

*త్రాగునీటి కొరత రాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆదేశాలు*

 

కోడూరు: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చింతకోళ్ల వాసుల దాహం తీర్చారు. సోమవారం కోడూరు మండలం మందపాకల శివారు చింతకోళ్ల గ్రామాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. గ్రామంలో త్రాగునీటి సరఫరాపై అధికారులతో మాట్లాడారు. మందపాకల త్రాగునీటి చెరువుకు ఫెన్సింగ్ వేయించాలని సూచించారు. ప్రత్యామ్నాయంగా ఉన్న కమ్మనమోల, ఇరాలి సీపీడబ్ల్యూ పథకం నుంచి కూడా త్రాగునీరు అందిస్తున్నామని అధికారులు తెలిపారు. త్రాగునీటి కొరత రాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆదేశించారు. వేసవి దృష్ట్యా ట్యాంకర్ ద్వారా త్రాగునీరు అందిస్తామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సుధా ప్రవీణ్, డిప్యూటీ ఎంపీడీఓ బీ.కోటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి సయ్యద్ సహానా పాల్గొన్నారు.

 

*ట్యాంకర్ ద్వారా త్రాగునీరు సరఫరా:*

 

ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఇచ్చిన మాటకు అనుగుణంగా చింతకోళ్ల ప్రజలకు మధ్యాహ్నమే ట్యాంకరుతో త్రాగునీరు అందచేశారు. ఎమ్మెల్యే సూచనలకు అనుగుణంగా జనసేన పార్టీ టౌన్ అధ్యక్షులు కోట రాంబాబు నాలుగు వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంకర్ ద్వారా రెండు రౌండ్లు త్రాగునీరు చింతకోళ్ల ప్రజలకు అందించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వేసవి తీవ్రత తగ్గే వరకు ట్యాంకర్ ద్వారా త్రాగునీరు అందిస్తామని రాంబాబు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
ప్రజా పాలనా - ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో పాల్గొన్న ఎంమ్మెల్యే
మంచిర్యాల జిల్లా పోలీస్ శాఖ,హాజీపూర్ మండలంలోని రాపల్లి గ్రామంలో రహదారి భద్రత కమిటీ ఆధ్వర్యంలో...
By Avunoori Mahesh 2026-04-13 10:34:05 0 137
Andhra Pradesh
అసిస్టెంట్ గవర్నమెంట్ పీడర్ గా సీనియర్ న్యాయవాది శరత్ చంద్ర ప్రసాద్
*అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరు గా సీనియర్ న్యాయవాది పొట్లూరి శరత్ చంద్ర ప్రసాద్*  ...
By Rajini Kumari 2026-02-06 09:30:26 0 153
Andhra Pradesh
కడప - బద్వేల్ రోడ్డు మార్గంలో.. కల్వర్టు కూలడంపై స్పందించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
కడప-బద్వేల్ రోడ్డు కల్వర్టు కూలిపోవడంపై మంత్రి ఆదేశాలు కడప-బద్వేల్ రోడ్డులో, లంకమల అటవీ...
By Pulse 2025-08-12 10:33:54 0 2K
Uttar Pradesh
UP Expands Digital Governance and Citizen Services
Uttar Pradesh continues to strengthen digital governance by expanding online public services and...
By Fathima Safa 2026-06-27 05:32:29 0 42
Andhra Pradesh
పుంగనూరు మండలంలో రోడ్డు ప్రమాదం
పుంగనూరు మండలం, గూడూరుపల్లి గ్రామ సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కాపాడం మిట్టపల్లి...
By Kothuru Murali 2026-06-29 11:29:13 0 108
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com