ఆపరేషన్ క్లీన్ స్వీట్లు రెండవ వారానికి శ్రీకారం

0
111

విజయవాడ నగరపాలక సంస్థ

30-05-2026

 

*ఆపరేషన్ క్లీన్ స్వీప్‌లో రెండో వారానికి శ్రీకారం*

 

 

*కాలువలు, స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, బ్యాక్ లేన్ల డీ-సిల్టింగ్‌పై ప్రత్యేక దృష్టి*

 

*ప్రజల భాగస్వామ్యంతో నగరాన్ని ముంపు రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యం*

 

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమంలో భాగంగా రెండో వారంలో చేపట్టతున్న స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, ప్రధాన కాలువలు, అంతర్గత డ్రెయిన్లు, బ్యాక్ లేన్ల డీ-సిల్టింగ్ కార్యక్రమాలకు శనివారం ఎన్‌టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం సమీపంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) డా. డి. చంద్రశేఖర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నీటి నిల్వలు, ముంపు సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కాలువలు, డ్రెయిన్లలో పేరుకుపోయిన మట్టి, చెత్త, సిల్ట్‌ను పూర్తిస్థాయిలో తొలగిస్తున్నామని తెలిపారు. నగరంలోని అన్ని సర్కిళ్ల పరిధిలో ప్రత్యేక బృందాలతో డీ-సిల్టింగ్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నాలుగు వారాలపాటు ప్రత్యేక అంశాలతో నిర్వహించబడుతోందని, మొదటి వారంలో రోడ్లు మరియు బహిరంగ ప్రదేశాల పరిశుభ్రతపై దృష్టి సారించగా, రెండో వారంలో స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, కాలువలు, బ్యాక్ లేన్ల శుభ్రత మరియు డీ-సిల్టింగ్ కార్యక్రమాలను ప్రజల సహకారంతో విస్తృతంగా చేపడుతున్నట్లు తెలిపారు.

 

నగరవ్యాప్తంగా డీ-సిల్టింగ్ పనుల పురోగతిని వివరిస్తూ ఇప్పటివరకు 128.91 కిలోమీటర్ల డ్రెయిన్లలో 116.56 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేసినట్లు, మిగిలిన 10.97 కిలోమీటర్ల డ్రెయిన్లలో కూడా పనులు వేగవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. ప్రధాన కాలువల్లో 79.60 కిలోమీటర్లకు గాను 72.23 కిలోమీటర్లు, మధ్య తరహా కాలువల్లో 49.31 కిలోమీటర్లకు గాను 44.33 కిలోమీటర్ల మేర డీ-సిల్టింగ్ పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. వర్షపు నీరు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రవహించేలా డ్రెయిన్లను పూర్తిస్థాయిలో శుభ్రపరుస్తున్నామని, నగర ప్రజలు కూడా కాలువలు, డ్రెయిన్లలో చెత్త వేయకుండా సహకరించాలని కోరారు. పరిశుభ్రమైన విజయవాడ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

 

 

ఈ కార్యక్రమంలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కే అర్జునరావు, చీఫ్ సిటీ ప్లాను కే సంజయ్ రత్నకుమార్, చీఫ్ ఇంజనీర్ ఇంచార్జ్ పి.సత్యకుమారి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ కే చంద్రశేఖర్, సూపర్డెంట్ ఇంజనీర్ (వర్క్స్) చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాల నాయక్ బయాలజిస్ట్ సత్యనారాయణ, ఇంజినీరింగ్ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, ప్రజలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

 

Search
Categories
Read More
SURAKSHA
Shri Sandip J. Jacques, IAS: A Leader in Law & Governance
A distinguished 2009-batch AGMUT cadre IAS officer, Shri Sandip J. Jacques has built an...
By Lokeshwari Panthadi 2026-07-20 13:36:43 0 37
Andhra Pradesh
ప్రజల సమస్యల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ‘మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు
ప్రజల సమస్యల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ‘మీ కోసం’ కార్యక్రమాన్ని...
By Chennaiah Kati 2026-07-22 15:30:03 0 32
Business & Finance
Tripura Expands Bamboo Industry for Rural Growth
Tripura is strengthening its bamboo industry by improving processing facilities, promoting...
By Navya Sree 2026-07-06 07:08:45 0 70
Rajasthan
Tourism Infrastructure and Heritage Conservation Growth
Rajasthan is enhancing its tourism sector through significant investments in infrastructure...
By Fathima Safa 2026-06-23 10:40:27 0 104
Telangana
హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ వల్ల 12 గ్రామల ప్రజలు దుర్వాసన, శ్వాసకోశ ఇబ్బందులు మరియు చర్మ వ్యాధులతో బాధపడుతున్నారు.
హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ గురించి ప్రస్తుతం ఉన్న డంపింగ్...
By Thalakayala Nagashiva 2026-04-12 07:17:29 0 290
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com