"ఈజీ మనీ కోసం నేరాల బాట.. చైన్ స్నాచర్ల ముఠా కటకటాల్లోకి.|

0
156

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :   సులభంగా డబ్బు సంపాదించి విలాసవంతమైన జీవితం గడపాలనే ఆశ, మత్తుకు బానిస కావడంతో నలుగురు యువకులు నేరాల బాట పట్టి చివరకు పోలీసుల చేతికి చిక్కారు. ఎల్లమ్మబండ ప్రాంతానికి చెందిన ఈ యువకులు ఆటోలు నడుపుతూ, వెల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నప్పటికీ జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

గత నెల రోజులుగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠా, ఒంటరిగా వెళ్తున్న వారి మెడల్లోని బంగారు గొలుసులను లాక్కొని పరారవుతూ వచ్చింది. వరుస ఘటనలతో ఆందోళన చెందిన బాధితులు పోలీసులను ఆశ్రయించగా, కేసులు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఘటన స్థలాల పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు నిందితుల కదలికలను గుర్తించి వారి జాడను కనిపెట్టారు.

పక్కా సమాచారంతో చేపట్టిన ఆపరేషన్‌లో నలుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి దోచుకున్న బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను కుత్బుల్లాపూర్ డీసీపీ కోటి రెడ్డి జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన జీడిమెట్ల పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. 

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

#sidhumaroju

Search
Categories
Read More
Telangana
సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.
మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న మల్కాజిగిరి...
By Sidhu Maroju 2025-06-21 17:20:38 0 1K
Andhra Pradesh
"గోమాత" ను గౌరవిద్దాం - సామరస్యాన్ని కాపాడుదాం....!
"బక్రీద్ "రోజు ఆవుల కుర్బానీ వద్దు, మేకలు-గొర్రెలతోనే త్యాగం చేద్దాం. ముస్లిం సోదరులకు విజ్ఞప్తి_...
By Patan Khuddus 2026-05-24 19:58:08 0 194
Andhra Pradesh
ప్రజల తీర్పే చరిత్రను మార్చింది.. ఏపీ పునర్నిర్మాణానికి కూటమి కట్టుబడి ఉంది: పవన్‌ కల్యాణ్‌.
    ప్రజల తీర్పే చరిత్రను మార్చింది.. ఏపీ పునర్నిర్మాణానికి కూటమి కట్టుబడి ఉంది:...
By Pagadala Venkateswar 2026-06-12 11:08:56 0 89
Telangana
GHMC విభజన పూర్తి- ఏప్రిల్ 1 నుండి స్వతంత్ర పాలన. |
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) నుంచి విభజించబడిన మూడు మున్సిపల్...
By Sidhu Maroju 2026-03-29 13:53:25 0 321
Assam
Critical Flood Situation Grips Six Districts in Assam
Assam is currently facing a dire flood crisis, with relentless waters impacting over 46,000...
By Lokeshwari Panthadi 2026-07-01 09:38:25 0 59
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com