"సరస్వతి పుష్కరాల్లో ఎమ్మెల్యే శ్రీగణేష్ పుణ్యస్నానం.|

0
157

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సరస్వతి అంత్య పుష్కరాల్లో ఎమ్మెల్యే శ్రీగణేష్ పుణ్యస్నానం.. కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు.

గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతీ నదుల సంగమ ప్రదేశమైన ఈ పుణ్యక్షేత్రంలో ఆయన సంప్రదాయబద్ధంగా స్నానమాచరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

అనంతరం సంగమ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి టెంపుల్ ల ను దర్శించుకున్న ఎమ్మెల్యే శ్రీగణేష్, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ, సరస్వతి అంత్య పుష్కరాల పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్థించినట్లు తెలిపారు. 

తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా, సస్యశ్యామలంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రజల జీవితాల్లో ఆనందం, శాంతి నెలకొనాలని కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. 

పుష్కరాల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తుండటంతో కాళేశ్వరం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది. 

#Sidhumaroju

Search
Categories
Read More
SURAKSHA
Vijaya K IAS: Empowering Governance Through Dedicated Leadership
A distinguished 2013-batch Andhra Pradesh cadre IAS officer known for transparent governance,...
By Lokeshwari Panthadi 2026-07-16 10:42:33 0 63
Andhra Pradesh
ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి: బహుజన యువసేన.
మదనపల్లె ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని విలువైన APIIC ప్రభుత్వ ఖాళీ ప్లాట్లను కొందరు వ్యక్తులు...
By Pagadala Venkateswar 2026-06-23 06:03:51 0 53
Andhra Pradesh
జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న హౌస్ లిస్టింగ్ సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
గురువారం రోజు ఉదయం మండలంలోని పడమటి కోన గ్రామం బోరెడ్డి గారి పల్లిలో మంత్రిగారి స్వగృహం నందు జన...
By Benguluri Madhubabu 2026-04-16 11:25:25 0 221
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా డీపీఎంఓగా బాధ్యతలు స్వీకరించిన రమేష్ బాబు.
అన్నమయ్య జిల్లా ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్ (డీపీఎంఓ)గా డాక్టర్ రమేష్ బాబు బుధవారం...
By Pagadala Venkateswar 2026-02-12 04:46:18 0 139
Business & Finance
Start Your Private Limited Company with Confidence
A Private Limited Company is one of the most trusted business structures in India, offering...
By Navya Sree 2026-07-13 09:34:08 0 47
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com