సముద్ర గర్భం కుచించిపోతోంది నానాటికి మన అడవులు అంతరించిపోతున్నాయి

0
76

సముద్ర గర్భం కుచించుకుపోతుంది.. నానాటికి మడ అడవులు అంతరించిపోతున్నాయి.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, CRZ నిబంధనలు సముద్ర గర్భంలో పాతి పెడుతూ భూ బకాసురులు సాగిస్తున్న అరాచకాలతో పర్యావరణం పెను ప్రమాదంలో పడుతోంది. సముద్ర తీరo వెంబడి గ్రామాల ప్రజల రక్షణ దినదిన గండంగా మారుతుంది. కొందరి స్వార్థపరుల దురాక్రమణ, భూ కబ్జాదార్ల మితిమీరిన బూదాహం, అక్రమార్జన.. దోపిడీ... కొందరి స్వార్థ రాజకీయపరుల స్వలాభాలు.. అధికారుల నిర్లక్ష్యం, అవినీతి వంటి కారణంగానే సముద్రం వెంబడి ప్రభుత్వ, పంచాయితీ ఫారెస్ట్, అసైన్డ్ భూములు అన్యాక్రాంతమవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి ఇలా కాలోనే చట్టాల ఉల్లంఘన.. పర్యావరణ విఘాత చర్యలు.. భూకబ్జాలు చోటు చేసుకోవడం కోసమెరుపు.!

 బందరు రూరల్ మండలం, పెదపట్నం గ్రామపంచాయతీ పరిధిలోని 181, 182/1,182/2,155/A155/B లలో సుమారు 40 ఎకరాల గ్రామపంచాయతీ ఆస్వాదిన అసైన్డ్, దిబ్బ, ఫారెస్ట్ భూములు అన్యాక్రాంతానికి గురయ్యాయి. ఆక్రమణదారులు సముద్రానికి రక్షణగా ఉన్న మడ అడవులు నరికివేసి ఆ భూముల్లో చెరువులు తవ్వారు. ఆక్రమణదారులు ఆ ప్రాంతంలో తమకున్న 16 సెంట్లు భూమిని చూపుతూ ఈ భూకబ్జాకు పాల్పడినట్లు సమాచారం.

*సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు పాతర.. CRZ నిబంధనలకు విరుద్ధం.

 పెదపట్నంలో యదేచిగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు పాతరేస్తున్నారు. సి ఆర్ జెడ్ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. మార్గదర్శకాలు.. సి ఆర్ జెడ్ జోన్ వన్ నిబంధన ప్రకారం సముద్రానికి 500 మీటర్ల లోపు ఎలాంటి ఆక్రములకు పాల్పడకూడదు. మడ అడవులు నరకడం, భూముల ఆక్రమించి చెరువులు తవ్వడం, పర్యావరణానికి విగాతం కలిగించడం, వన్యప్రాణులకి నష్టం కలిగించే చర్యలు చేపట్టడం చట్టరీత్యా కఠిన నేరం. ఇవేమీ పట్టకుండా బంటుమిల్లి కి చెందిన ఓ న్యాయవాది పట్టపగలే మడ అడవులు నరికి చెరువులు తవ్వి భూ కబ్జాకు పాల్పడి సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు సవాల్ విసరడం ఇక్కడ కొస మెరుపు. ఆక్రమణలతో సముద్రం ఘోషిస్తున్న అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విశేషం.

* జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు 

..................

 పెదపట్నంలో భూముల ఆక్రమణ, మడ అడవులు నరికి చెరువులు తవ్విన ఘటనపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు అందింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, సి ఆర్ జెడ్ జోన్ వన్ నిబంధనలకు వ్యతిరేకంగా అధికారులు అండదండలతో 40 ఎకరాలు ఆక్రమించారని మచిలీపట్నానికి చెందిన న్యాయవాది జీవీ రమణ జిల్లా కలెక్టర్ బాలాజీ ని కలిసి ఫిర్యాదు అందజేశారు. అంగర రంగనాథ్, అంగర రామ్మోహన్ రావు, అంగర వెంకట నవీన, అంగర రమాదేవి, అంగర రజిని, అంగర అరుణ్ కుమార్ లు ఈ ఆక్రమణకు పాల్పడి మడ అడవులు నరికి చెరువులు తవ్వారని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుని సహకరించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు చేపట్టి భూములు స్వాధీనం చేసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Search
Categories
Read More
Telangana
సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.
మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న మల్కాజిగిరి...
By Sidhu Maroju 2025-06-21 17:20:38 0 1K
SURAKSHA
Vivek Yadav IAS: Championing Transparent Electoral Governance
A dynamic Andhra Pradesh cadre IAS officer whose leadership in election management, urban...
By Lokeshwari Panthadi 2026-07-16 09:40:52 0 53
Telangana
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు. స్వయంగా పరిశీలించిన మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్
ఆసిఫాబాద్ పట్టణంలోని దస్నాపూర్ వార్డులో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులను ముమ్మరంగా...
By Chunarkar Jagadeesh 2026-07-22 15:19:12 0 49
Andhra Pradesh
వ్యవసాయ రంగం పట్ల అశ్రద్ధ చూపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు - వడ్డే శోభనాద్రీశ్వరరావు మాజీ మంత్రివర్యులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయం రంగం పట్ల అశ్రద్ధ చూపుతూ ఆదాని, అంబానీ లాంటి బడా కార్పొరేట్...
By John Baji 2025-12-23 16:04:42 0 255
Karnataka
Karnataka Poll Prep: Massive Door-to-Door Voter Roll Update
The Election Commission of India has officially launched the Special Intensive Revision (SIR) of...
By Lokeshwari Panthadi 2026-06-30 08:45:10 0 78
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com