"అల్వాల్‌లో 33 ఏళ్ల వ్యక్తి అదృశ్యం.. లుక్ అవుట్ నోటీసు జారీ.|

0
291

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన నమోదైంది. 

పోలీసులు విడుదల చేసిన లుక్‌అవుట్ నోటీసు ప్రకారం పొట్టబత్తిని ఇళయరాజా (33) అనే వ్యక్తి ఈ నెల 27వ తేదీ ఉదయం నుంచి కనిపించకుండా పోయాడు. 

ఈ ఘటనపై అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇళయరాజా భార్య గండూరి ప్రశాంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది. 

ఆమె తన పిల్లలతో కలిసి స్కూల్ సెలవుల కారణంగా ఈ నెల 25న తన తల్లి ఇంటికి వెళ్లినట్లు తెలిపింది. అనంతరం 26వ తేదీ రాత్రి భర్తతో ఫోన్‌లో మాట్లాడినట్లు పేర్కొంది.

అయితే 27వ తేదీ ఉదయం భర్త ఉద్యోగానికి హాజరుకాలేదని కార్యాలయం నుంచి సమాచారం రావడంతో ఇంటికి చేరుకుని చూడగా, ఇంట్లో నుంచి కొన్ని బట్టలు మరియు మొబైల్ ఛార్జర్ తీసుకుని వెళ్లిపోయినట్లు గుర్తించినట్లు తెలిపింది.

అతని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

దీంతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

ఇళయరాజా ఎత్తు సుమారు 5 అడుగుల 5 అంగుళాలు, గోధుమ వర్ణం, నల్ల జుట్టు, గుండ్రటి ముఖాకృతి కలిగి ఉన్నట్లు పోలీసులు వివరించారు. 

లోత్కుంట, ఆదర్శ్ నగర్ ప్రాంతానికి చెందిన ఆయన ఆచూకీ తెలిసిన వారు అల్వాల్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
ఇంద్రకీలాతి కేశఖండనశాల వేలం ప్రక్రియ పూర్తి 80% మేరకు పెరిగిన ఆదాయం
*ఇంద్రకీలాద్రిపై కేశఖండన శాల వెంట్రుకల వేలం ప్రక్రియ పూర్తి* – *సుమారు 80% మేర పెరిగిన...
By Rajini Kumari 2025-12-29 13:18:43 0 180
Andhra Pradesh
పుంగనూరు పట్టణానికి చెందిన మైనారిటీ నాయకుడు ఫక్రూదిన్ షరీఫ్‌ను రాజంపేట జోన్ మైనారిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బుధవారం నియమించారు.
వైయస్సార్సీపి అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, పుంగనూరు పట్టణానికి చెందిన మైనారిటీ...
By Kothuru Murali 2026-01-08 13:03:48 0 182
Andhra Pradesh
మదనపల్లిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో, 25...
By Pagadala Venkateswar 2026-01-13 07:41:48 0 186
Andhra Pradesh
TTD: మార్చి 17న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.
ఈ నెల 19న ఉగాది పర్వదినం ఉగాదిని పురస్కరించుకుని ఈ నెల 17న ఆలయ శుద్ధి కార్యక్రమం 17న బ్రేక్...
By Pagadala Venkateswar 2026-03-05 13:05:53 0 143
Andhra Pradesh
Chandrababu Naidu: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. ఈ కీలక అంశాలపై చర్చ!
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 11 గంటలకు కేబినెట్ సమావేశం వివిధ కీలక అంశాలపై చర్చించి...
By Pagadala Venkateswar 2026-01-28 06:23:05 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com