కూకట్పల్లిలో 62 మంది నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ

0
289

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే కలుషితరహిత త్రాగునీరు, మెరుగైన రహదారులు, నిరంతర విద్యుత్ సరఫరా, సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి అత్యవసరమని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.

కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని కైతలాపూర్‌లో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను 62 మంది నిరుపేద లబ్ధిదారులకు కేటాయిస్తూ పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి స్వయంగా లబ్ధిదారులకు పట్టాలు అందజేసి, ఒక ఇంటిలో పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమం కైతలాపూర్ లో జరిగింది.

ఈరోజు జరిగిన కార్యక్రమంలో పట్టాల పంపిణీ చేపట్టారు.

కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తో పాటు ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, కలెక్టర్ మనో చౌదరి, జోనల్ కమిషనర్, ఎమ్మార్వో మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

   నిరుపేదలకు గృహ వసతి కల్పించడం, మహిళల ఆర్థికాభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పెట్రోల్ బంకుల కేటాయింపు, మహిళా సంఘాలకు బస్సుల అందజేత వంటి పథకాల ద్వారా మహిళల సాధికారతకు కృషి చేస్తోందన్నారు. అలాగే చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

  కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ మాట్లాడుతూ కూకట్‌పల్లి నియోజకవర్గంలో అధిక సంఖ్యలో నిరుపేదలు ఉన్నారని, వారికి మరిన్ని నిధులు కేటాయించి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని విస్తరించాలని మంత్రిని కోరారు.

Search
Categories
Read More
Business & Finance
June Rainfall Deficit Raises Farm Economy Concerns
Haryana recorded a 44% rainfall deficit in June, while Gurugram reported a 37% shortfall, raising...
By Navya Sree 2026-07-01 08:45:50 0 66
Telangana
ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు
కొత్త ఆరోగ్య, ప్రమాద బీమా పథకాలకు కేబినెట్ ఆమోదం   60 ఏళ్లలోపు ఉద్యోగి సహజ మరణానికి రూ.10...
By Pinnehasan Odela 2026-02-24 15:54:56 0 215
Andaman & Nikobar Islands
ICG Rescues Foreign Crew from Stranded Yacht Near Nicobar Islands
 The Indian Coast Guard (ICG) successfully rescued two foreign nationals—a citizen of...
By Bharat Aawaz 2025-07-17 08:10:25 0 1K
Manipur
Displaced Families Blocked from Returning to Village in Manipur
 Security forces in Manipur halted the return of nearly 100 internally...
By Bharat Aawaz 2025-07-17 06:59:52 0 1K
Andhra Pradesh
నిమ్మనపల్లెలో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి.
నిమ్మనపల్లి మండలంలో బుధవారం చేపల వేటకు వెళ్లిన వెంకటరమణ (45) అనే వ్యక్తి ప్రమాదవశాత్తూ చెరువులో...
By Pagadala Venkateswar 2026-05-20 13:50:44 0 78
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com