అకాల వర్షాల వల్ల మార్కెట్ యార్డులలో తడిసిపోయిన ధాన్యం, రైతన్నలకు తీవ్ర నష్టం
అకాల వర్షాల (Unseasonal Rains) కారణంగా తెలంగాణ రాష్ట్రంల్లోని రైతన్నలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. చేతికొచ్చిన పంటలు నీట మునగడం, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో బస్తాలు తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
ధాన్యం తడిసిపోవడం: ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లు, మొక్కజొన్నలు వర్షానికి తడిసి ముద్దవుతున్నాయి. మార్కెట్ యార్డులు మరియు కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేకపోవడంతో ధాన్యం మొలకెత్తుతోంది.
పంట రంగు మారిపోవడం, తేమ శాతం పెరగడంతో మద్దతు ధర లభించదు. దీంతో పెట్టుబడులు కూడా చేతికి అందక రైతులు అప్పులపాలవుతున్నారు
ఈదురుగాలులతో కూడిన వర్షాలకు వరి, మామిడి, అరటి, పసుపు మరియు కూరగాయల పంటలు నేలవాలి తీవ్ర నష్టం
అకాల వర్షాల వల్ల మార్కెట్ యార్డులలో తడిసిపోయిన ధాన్యం, రైతుల ఆవేదన
రైతులు తమ కష్టాన్ని ప్రభుత్వమే గుర్తించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి, నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz