అంబరాన్నంటిన రెండో రోజు 'రేలా' సంబురాలు.. గిరిజన కళా ప్రదర్శనలు అద్భుతం: కలెక్టర్ దినేష్ కుమార్!
ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లాలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక 'రేలా' గిరిజన ఉత్సవాలు రెండో రోజు అత్యంత వైభవంగా సాగాయి. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారి పర్యవేక్షణలో అధికారికంగా ప్రారంభమైన ఈ వేడుకలు, అడవితల్లి ఒడిలో గిరిజన సంస్కృతి వైభవానికి అద్దం పట్టాయి.సాధారణంగా ఇలాంటి భారీ గిరిజన కళా ఉత్సవాలు ఈశాన్య భారతదేశంలో (North-East States) ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే, మన ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా లో ఇంత భారీ ఎత్తున ఈ ఉత్సవాలను నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ అరుదైన వేడుకల్లో పాల్గొనేందుకు కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా.. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా నుండి భారీగా గిరిజన తెగలు తరలివచ్చాయి.రెండో రోజు వేడుకల్లో భాగంగా గిరిజనులు తమ సంప్రదాయ పండుగలు, గిరిజన వివాహ వేడుకలు, మరియు పురాతన నృత్య రీతులను కళ్ళకు కట్టినట్లు ప్రదర్శించారు. నెమలి పించాల అలంకరణలు, సాంప్రదాయ వాయిద్యాల మోతలతో రంపచోడవరం ప్రాంతం మారుమోగిపోయింది. అంతరించిపోతున్న తమ కళా సాంప్రదాయాలను కాపాడుకునేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ వేదికపై నాలుగు రాష్ట్రాల గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
# Yadagiri
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz