నిజామాబాద్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా శ్రీ వర్ధన్ హాస్పిటల్లో డా. సృజిల్ బాబు తేడ్డు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం మరియు ఆరోగ్య పరీక్షల కార్యక్రమంలో నిజామాబాద్ నగర మేయర్ శ్రీమతి ఉమారాణి రమేష్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మేయర్ గారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. సమాజ సేవకు అంకితభావంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో వైద్యుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదినాన్ని సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
ఈ ఉచిత ఆరోగ్య శిబిరంలో పలువురు ప్రజలు ఆరోగ్య పరీక్షలు చేయించుకొని వైద్యుల సూచనలు పొందారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ కుటుంబానికి హృదయపూర్వక అభినందనలు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz