పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన సామాన్యుడి నడ్డి విరిచేలా కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలు పెంచుతోంది : డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క

0
474

🎤కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్): ఆసిఫాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఆసిఫాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తికాగానే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్య ప్రజలపై అదనపు భారం మోపడం దుర్మార్గమని అన్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, ఇంధన ధరల పెంపుతో రవాణా ఛార్జీలు, సరుకు రవాణా ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు మేలు చేస్తూ సాధారణ ప్రజలపై భారాలు మోపుతోందని విమర్శించారు. వెంటనే పెంచిన ధరలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ తారీక్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు

Search
Categories
Read More
SURAKSHA
Mukesh Singh, IPS: Leading Manipur with Courage & Vision
A distinguished Indian Police Service officer, Mukesh Singh has led Manipur Police through some...
By Lokeshwari Panthadi 2026-07-22 09:57:41 0 37
Mizoram
Mizoram Partners with Israel for Water Sustainability
The Mizoram government is taking proactive steps to transform the state's water security by...
By Lokeshwari Panthadi 2026-07-02 06:41:59 0 87
Telangana
జెడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధం
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధం!   Apr 25, 2026, తెలంగాణలో జిల్లా ప్రజాపరిషత్...
By Midathapalli Kiran Kumar 2026-04-25 05:49:27 0 297
Telangana
తెలంగాణలో మైనారిటీల కోసం రెండు కొత్త పథకాలు!
తెలంగాణలో మైనారిటీల కోసం రెండు కొత్త పథకాలు తెలంగాణ ప్రభుత్వం, SC/ST & Minorities Welfare...
By BMA ADMIN 2025-11-05 09:19:25 0 887
Andhra Pradesh
మిద్దెపై నుంచి పడి ఎంబీఏ విద్యార్థికి తీవ్ర గాయాలు.
పుంగనూరు మండలం కుక్కలపల్లిలో ఎంబీఏ విద్యార్థి గంగరాజు (24) తన స్నేహితుడి ఇంట్లో మిద్దెపై...
By Pagadala Venkateswar 2026-05-09 07:52:57 0 103
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com