ప్రియుడే హంతకుడా.....? దుగ్గొండి మండలంలో వివాహిత దారుణం హత్య కేసు కొలిక్కి....

0
135

ప్రియుడే హంతకుడా..?

దుగ్గొండి మండలంలో వివాహిత దారుణ హత్య కేసు కొలిక్కి..

ప్రేమ వ్యవహారమే ఘోరానికి దారితీసిందన్న కోణంలో పోలీసుల విచారణ..

మృతురాలి సామాజిక వర్గం నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు..

కీలకమైన కాల్ డేటా, ఘటనా స్థల ఆధారాలతో నిందితుడి గుర్తింపు..

అధికారుల అధికారిక నివేదిక రాగానే నేడో రేపో రిమాండ్‌కు  తరలింపు...

భారత్ అవాజ్ న్యూస్:. దుగ్గొండి : మండలంలోని లక్ష్మీపురం శివారులో చోటుచేసుకున్న వివాహిత హత్య కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగినట్లు సమాచారం. ఈ కేసులో మృతురాలికి సన్నిహితంగా ఉన్న వ్యక్తినే పోలీసులు ప్రధాన అనుమానితుడిగా గుర్తించినట్లు తెలిసింది. ప్రేమ వ్యవహారమే హత్యకు దారితీసి ఉండొచ్చన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. లక్ష్మీపురం గ్రామానికి చెందిన తాళ్లపెల్లి సుమలత హత్య కేసులో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు, ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటన జరిగిన ప్రాంతంలో సేకరించిన ఆధారాలు, కాల్ డేటా, స్థానికుల వాంగ్మూలాల ఆధారంగా కేసును ఛేదించినట్లు తెలుస్తోంది....

 

అట్రాసిటీ సెక్షన్ల నమోదుకు సన్నద్ధం...!

మృతురాలు ఎస్సీ వర్గానికి చెందిన మహిళ కావడంతో కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసు నమోదు చేసే అంశంపై పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి సంబంధిత రెవెన్యూ అధికారుల నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిసింది. బాధితురాలి సామాజిక వర్గానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు మరియు నివేదిక అందిన వెంటనే అట్రాసిటీ సెక్షన్లు చేర్చే అవకాశం ఉందని ఉన్నతాధికారుల ద్వారా సమాచారం అందుతోంది. ఇక పోలీసుల అదుపులో ఉన్న ప్రధాన నిందితుడిని నేడో రేపో న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను, నిందితుడి వివరాలను పోలీసులు త్వరలోనే అధికారికంగా వెల్లడించాల్సి ఉంది... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము...

Search
Categories
Read More
Andhra Pradesh
కర్నూలు ఎస్పీ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదులపరిష్కార వేదిక !!
కర్నూలు : కర్నూలు జిల్లా...•  ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్...
By Hari Krishna 2025-12-29 10:49:25 0 246
Andhra Pradesh
మదనపల్లె కేంద్రీయ విద్యాలయంలో సీట్ల భర్తీ ప్రారంభం.
అన్నమయ్య జిల్లా మదనపల్లె కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యాసంవత్సరానికి సీట్ల భర్తీ ప్రక్రియ...
By Pagadala Venkateswar 2026-04-09 12:52:44 0 109
Telangana
యువతకు జైలు అనుభూతిని పరిచయం చేస్తున్న చంచల్‌గూడ జైలు
హైదరాబాద్: సమాజంలోని యువత, యువకులు, విద్యార్థులకు నేరాలు చేసినప్పుడు ఎదురయ్యే శిక్షలు మరియు జైలు...
By Akshay Goud 2026-06-12 13:08:39 0 204
Andhra Pradesh
TTD Chairman BR Naidu: టీటీడీ వార్షిక బడ్జెట్ ప్రకటన... పూర్తి వివరాలు.
TTD Chairman BR Naidu: టీటీడీ వార్షిక బడ్జెట్ ప్రకటన... పూర్తి వివరాలు ఇవిగో! 28-02-2026 Sat...
By Pagadala Venkateswar 2026-02-28 12:43:27 0 163
Telangana
కార్మికుల వేతనం పెంచాలని కార్మికుల నిరసన
రామంతాపూర్ పరిధిలోని కెసిఆర్ నగర్ లో కార్మికుల వేతనం పెంచాలని.. ఇప్పుడు ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం...
By Mahankali Ravi 2026-06-12 06:32:30 0 143
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com