కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద "జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డి గారి, జిల్లా పర్యటనను విజయవంతం చేయాలి" డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క

0
142

🎤కొమురం బీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు, జూన్ 2వ తేదీన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనను అత్యంత విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పిలుపునిచ్చారు.శుక్రవారం కెరమెరి మండలం కేస్లాగూడ గ్రామంలో గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,మరియు కార్యకర్తలతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ.. జూన్ 2న కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్డు వద్ద నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జిల్లాకు సంబందించిన పలు కీలక అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఈ సభకు ప్రతి గ్రామ పంచాయతీ నుండి ప్రజలు, రైతులు, మహిళలు మరియు కాంగ్రెస్ శ్రేణులు సమష్టిగా కృషి చేసి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు: తులసిరాం, బాపూరావ్, కెరమెరి ఉప సర్పంచ్ వాగ్మారే శ్రీకాంత్, అమూల్, బలిరాం, కాంగ్రెస్ నాయకులు రాథోడ్ శంకర్ నాయక్, రాథోడ్ సుదర్శన్, కోవ ఇందిరా, రాథోడ్ శంకర్ నాయక్, మందాడే విశ్వనాథ్, నాగేష్, గిడ్డప్ప, మురళి, జగన్నాథ్ రావు, చౌహాన్ శంకర్, కేశవ్, చాహకటి జంగు, భీంరావు, ఆత్రం ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కి నోటీసులు ఇవ్వడం శోచనీయం : MLA మర్రి రాజశేఖర్ రెడ్డి.|
        మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు...
By Sidhu Maroju 2026-01-29 14:16:27 0 168
Andhra Pradesh
మదనపల్లి: అర్జీలను పెండింగ్ లేకుండా పరిష్కరించాలి - కలెక్టర్.
మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)'లో జిల్లా...
By Pagadala Venkateswar 2026-03-03 05:35:37 0 111
Andhra Pradesh
మదనపల్లె: ఇంట్లో పాతిపెట్టిన బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం.
మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లిలో శుక్రవారం ఒక అనుమానాస్పద ఘటన వెలుగుచూసింది. ఇంట్లో పాతిపెట్టిన...
By Pagadala Venkateswar 2026-03-21 06:09:55 0 134
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: సదుం మండలంలో వృద్దురాలి మెడలో గొలుసు చోరీ
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో శుక్రవారం జరిగిన సంఘటనలో, దిగువ జాండ్రపేటలో వంతెన వద్ద...
By Kothuru Murali 2026-04-11 06:30:58 0 72
Andhra Pradesh
పోలవరం ప్రాజెక్టులో రెండవ రోజు కొనసాగుతున్న విదేశీ నిపుణుల బృందం
*పోలవరం ప్రాజెక్ట్ లో రెండోరోజు కొనసాగుతున్న విదేశీ నిపుణుల బృందం పర్యటన*   *పోలవరం, జనవరి...
By Rajini Kumari 2026-01-20 10:58:14 0 142
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com