గంజాయి నిర్మూలనలో ప్రజల సహకారం అవసరం : మంచిర్యాల డిసిపి ఏ. భాస్కర్.

0
41

మంచిర్యాల : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్‌లో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు బానిసలైన వారిలో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన డి-అడిక్షన్ సెంటర్‌ను మంచిర్యాల డిసిపి ఏ. భాస్కర్, మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్ కలిసి సందర్శించారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డి-అడిక్షన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న యువకులతో డిసిపి మాట్లాడి,వారి ఆరోగ్య పరిస్థితి,చికిత్స విధానం గురించి వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా డిసిపి గారు మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి నార్కోటిక్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారిని గౌరవ కోర్టు ఆదేశాల మేరకు 15 రోజుల పాటు డి-అడిక్షన్ సెంటర్‌కు పంపిస్తున్నామని తెలిపారు.ఇక్కడ వారికి వైద్య చికిత్సతో పాటు మానసికంగా మార్పు తీసుకురావడానికి ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు మంచిర్యాల జోన్ పరిధిలో 19 మందికి నార్కోటిక్ పరీక్షలు నిర్వహించి,పాజిటివ్ వచ్చిన వారిని డి-అడిక్షన్ సెంటర్లకు తరలించినట్లు వెల్లడించారు.గంజాయి సరఫరా చేసే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, అలాగే గంజాయి సేవించే వారిని గుర్తించి వారిని ఆ అలవాటు నుంచి దూరం చేస్తే సరఫరా కూడా తగ్గే అవకాశముందని డిసిపి అన్నారు. తల్లిదండ్రులు,పెద్దలు తమ పరిసరాల్లో ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నా లేదా సేవిస్తున్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.పోలీసులు స్పందించి నిందితులపై కేసులు నమోదు చేసి నార్కోటిక్ పరీక్షలు నిర్వహిస్తారని, పాజిటివ్ వచ్చిన వారిని డి-అడిక్షన్ సెంటర్లకు పంపించి చికిత్స అందిస్తామని తెలిపారు.అయితే చికిత్స తర్వాత కూడా మళ్లీ మత్తు పదార్థాలకు బానిసై పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.నిపుణులైన వైద్యుల సహాయంతో మత్తు బారిన పడిన వ్యక్తులు తిరిగి సాధారణ జీవితంలోకి వచ్చే అవకాశం ఉందని, డ్రగ్స్ రహిత మంచిర్యాల నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని డిసిపి భాస్కర్ పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు పట్టణం లో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్‌లో వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలను ఈనెల 16న ఉదయం 10:30 గంటలకు వేలం.
పుంగనూరు పట్టణంలోని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్‌లో వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలను...
By Kothuru Murali 2026-03-15 10:17:50 0 118
Telangana
వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి... మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలంలో రైతు వేదికలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువజన ఉత్సవ...
By Gangaram Rangagowni 2026-01-12 06:05:30 0 187
Telangana
మెదక్ జిల్లా ప్రజలకు బోగి మకర సంక్రాంతి శుభాకాంక్షలు... జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
మెదక్ జిల్లా కలెక్టర్ హిందువులు జరుపుకునే పండుగల్లో అతి పెద్ద పండగ సంక్రాంతి అని ఈ పండగ ను,మొదటి...
By Gangaram Rangagowni 2026-01-13 10:22:56 0 216
Andhra Pradesh
22 భూ సమస్యల పరిష్కారంలో ఏలూరు జిల్లా రాష్ట్రానికి ఆదర్శం
పత్రిక ప్రకటన  *22ఏ భూ సమస్యల పరిష్కారంలో ఏలూరు జిల్లా రాష్ట్రానికే ఆదర్శం*   *290...
By Rajini Kumari 2026-05-15 12:09:39 0 78
Telangana
కేసీఆర్‌ను దగ్గర నుంచి చూస్తే కథేమిటో అర్థమవుతుంది: టీ పీసీసీ చీఫ్
హైదరాబాద్: కేసీఆర్ అనే పులి ఫాం హౌస్‌కే పరిమితమైందని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్...
By Ponnala Srinivasrao 2026-04-22 02:00:25 0 73
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com