గంజాయి నిర్మూలనలో ప్రజల సహకారం అవసరం : మంచిర్యాల డిసిపి ఏ. భాస్కర్.

0
146

మంచిర్యాల : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్‌లో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు బానిసలైన వారిలో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన డి-అడిక్షన్ సెంటర్‌ను మంచిర్యాల డిసిపి ఏ. భాస్కర్, మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్ కలిసి సందర్శించారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డి-అడిక్షన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న యువకులతో డిసిపి మాట్లాడి,వారి ఆరోగ్య పరిస్థితి,చికిత్స విధానం గురించి వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా డిసిపి గారు మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి నార్కోటిక్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారిని గౌరవ కోర్టు ఆదేశాల మేరకు 15 రోజుల పాటు డి-అడిక్షన్ సెంటర్‌కు పంపిస్తున్నామని తెలిపారు.ఇక్కడ వారికి వైద్య చికిత్సతో పాటు మానసికంగా మార్పు తీసుకురావడానికి ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు మంచిర్యాల జోన్ పరిధిలో 19 మందికి నార్కోటిక్ పరీక్షలు నిర్వహించి,పాజిటివ్ వచ్చిన వారిని డి-అడిక్షన్ సెంటర్లకు తరలించినట్లు వెల్లడించారు.గంజాయి సరఫరా చేసే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, అలాగే గంజాయి సేవించే వారిని గుర్తించి వారిని ఆ అలవాటు నుంచి దూరం చేస్తే సరఫరా కూడా తగ్గే అవకాశముందని డిసిపి అన్నారు. తల్లిదండ్రులు,పెద్దలు తమ పరిసరాల్లో ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నా లేదా సేవిస్తున్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.పోలీసులు స్పందించి నిందితులపై కేసులు నమోదు చేసి నార్కోటిక్ పరీక్షలు నిర్వహిస్తారని, పాజిటివ్ వచ్చిన వారిని డి-అడిక్షన్ సెంటర్లకు పంపించి చికిత్స అందిస్తామని తెలిపారు.అయితే చికిత్స తర్వాత కూడా మళ్లీ మత్తు పదార్థాలకు బానిసై పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.నిపుణులైన వైద్యుల సహాయంతో మత్తు బారిన పడిన వ్యక్తులు తిరిగి సాధారణ జీవితంలోకి వచ్చే అవకాశం ఉందని, డ్రగ్స్ రహిత మంచిర్యాల నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని డిసిపి భాస్కర్ పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా ఆదాయం పెంపుపై కలెక్టర్ దృష్టి.
మదనపల్లిలో శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఖజానా ఆదాయం పెంచే...
By Pagadala Venkateswar 2026-04-18 03:53:40 0 161
Gujarat
Patan District Demands Urgent Bush Clearance for Road Safety
Commuters and local residents in Gujarat’s Patan district are raising urgent demands for...
By Lokeshwari Panthadi 2026-06-27 08:38:47 0 84
Andhra Pradesh
మహారాష్ట్రకు చెందిన 5 గురు సభ్యుల డెకాయిటీ గ్యాంగ్‌ను చకచక్యంగా అదుపులోకి తీసుకున్న బాపట్ల జిల్లా పోలీసులు ఎస్పీ శ్రీ బి.ఉమా మహేశ్వర్ ఐపీఎస్ గారి నేతృత్వంలో కొనసాగిన ప్రత్యేక ఆపరేషన్
మహారాష్ట్రకు చెందిన 5 గురు సభ్యుల డెకాయిటీ గ్యాంగ్‌ను చకచక్యంగా అదుపులోకి తీసుకున్న బాపట్ల...
By Gadiyapudi Narendra 2026-01-10 16:32:04 0 436
SURAKSHA
: TN Police Taking Strict Action Against Drugs
TN Police Taking Strict Action Against DrugsContent: With the goal of a drug-free Tamil Nadu, the...
By Kalaga Sailaja 2026-06-27 10:35:20 0 120
Andhra Pradesh
స్థానిక కలెక్టర్ ప్రజా సమస్యల వేదిక
సోమవారం(22/12/2025) స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక...
By Rajini Kumari 2025-12-22 07:50:52 0 227
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com