కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కీలక సమావేశం

0
55

కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు పార్టీ కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వ్యూహాలు, బీఎల్ఏల నియామకం, ఎస్ఐఆర్ కార్యక్రమంపై అవగాహన, అలాగే నూతన పార్టీ కమిటీల ఏర్పాటు వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.

ఈ కార్యక్రమానికి కూకట్‌పల్లి నియోజకవర్గ ఎన్నికల కమిటీ ఇంచార్జ్, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ , కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ , తెలంగాణ ప్రభుత్వ టెక్నికల్ సర్వీసెస్ చైర్మన్ మన్నె సతీష్ , కమ్మ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మరియు కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం, ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

సమావేశంలో నాయకులు కార్యకర్తలతో ముఖాముఖిగా మాట్లాడి పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని వివరించారు. ముఖ్యంగా బూత్ స్థాయిలో పార్టీ నిర్మాణం, బీఎల్ఏల నియామక ప్రక్రియ, ఎస్ఐఆర్ కార్యక్రమంపై స్పష్టమైన అవగాహన కల్పించారు. అలాగే త్వరలో ఏర్పాటు చేయనున్న పార్టీ కమిటీలలో చురుకైన కార్యకర్తలకు ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా కార్యకర్తలు తమ అభిప్రాయాలు, సూచనలు నాయకులతో పంచుకున్నారు. రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా అందరూ ఐక్యంగా పనిచేస్తామని, గ్రేటర్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు

Search
Categories
Read More
Andhra Pradesh
ఈ నెల 22న విజయవాడలో క్రిస్మస్ వేడుకలకు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు
*ఈ నెల 22న విజయవాడలో క్రిస్మస్ హైటీ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం నిర్వహించనుంది. దీనికి ముఖ్య...
By Rajini Kumari 2025-12-17 09:08:02 0 183
Andhra Pradesh
పార్లమెంటరీ హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు.
బాపట్ల: లోక్‌సభ ప్యానెల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ కృష్ణ ప్రసాద్ తెన్నేటి...
By Gadiyapudi Narendra 2026-02-17 15:55:02 0 128
Andhra Pradesh
పుంగనూరు: నకిలీ సీళ్ల కేసులో ఐదుగురు అరెస్ట్
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం 106 రామిరెడ్డిగారి పల్లె విలేజ్ సెక్రటరీ సీళ్లను...
By Kothuru Murali 2026-03-24 13:41:26 0 115
Andhra Pradesh
పుంగనూరు: బోయకొండ పాత బస్టాండు లోఆటో బోల్తా పడి 11 మంది భక్తులకు గాయాలు
శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, శ్రీ బోయకొండ గంగమ్మ దర్శనానికి వచ్చిన తెనాలి వలస...
By Kothuru Murali 2026-01-30 15:07:17 0 128
Andhra Pradesh
శ్రీకాకుళం: 'టీడీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలి'
శ్రీకాకుళం నగరంలో జర్నలిస్టుపై జరిగిన దాడికి నిరసనగా జర్నలిస్టు నాయకులు ఆందోళన చేపట్టారు. ఆ...
By Manda Ramkumar 2026-03-28 09:00:03 0 277
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com