"అల్వాల్‌లో యువతి మిస్సింగ్.. ప్రియుడిపైనే తల్లి అనుమానం.?

0
198

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మచ్చ బొల్లారం స్రవంతి నగర్‌లో ఒక యువతి అనుమానాస్పద స్థితిలో కనిపించకుండా పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

స్రవంతి నగర్ ప్లాట్ నెంబర్ 419లో నివాసం ఉంటున్న కొత్తపల్లి మంజుల కుమార్తె సునీత (20) ఈ నెల 19వ తేదీ ఉదయం నుండి అకస్మాత్తుగా అదృశ్యమైంది. 

ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో తల్లి మంజుల స్నానానికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఉన్న సునీత కనిపించకుండా పోయింది. యువతితో పాటు ఆమె బట్టలు, మొబైల్ ఫోన్ కూడా మాయమవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.

బాధిత కుటుంబ సభ్యులు తమకు తెలిసిన ప్రాంతాలతో పాటు సొంత ఊరిలోనూ సునీత కోసం గాలించినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. 

అయితే, గతంలో సునీత తాను ప్రవీణ్ అనే యువకుడిని ప్రేమిస్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ యువతి తల్లి గురువారం సాయంత్రం అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, యువతిని సురక్షితంగా కనిపెట్టేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Business & Finance
Manipur Boosts Handloom and Handicraft Exports
The Manipur government is strengthening support for the state's handloom and handicraft sector...
By Navya Sree 2026-07-02 08:04:47 0 47
Telangana
హనుమకొండ కు చేరుకున్న హరీష్ రావు ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు.....
హనుమకొండకు చేరుకున్న హరీశ్ రావు.. ఘన స్వాగతం భారత్ అవాజ్ న్యూస్: 14 జూన్ రోజున బీఆర్ఎస్ సీనియర్...
By Gujile Ramu 2026-06-14 13:07:42 0 163
Andhra Pradesh
గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ దశ శంకుస్థాపనకు గుంటూరు పశ్చిమ నుంచి భారీ బైక్ ర్యాలీతో హాజరైన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు నగర అభివృద్ధిలో కీలకమైన ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ దశ శంకుస్థాపన కార్యక్రమానికి గుంటూరు...
By John Baji 2026-01-04 03:46:24 0 218
Andhra Pradesh
S Abdul Nazeer: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు: ఏపీ గవర్నర్ ప్రసంగం...
    S Abdul Nazeer: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు: ఏపీ గవర్నర్ ప్రసంగం... Andhra S...
By Pagadala Venkateswar 2026-02-11 11:36:49 0 145
Telangana
ప్రతి ఓటు రక్షణే లక్ష్యం: శ్రీనివాస్ వర్మ.|
"అల్వాల్‌లో సీనియర్ సిటిజన్స్‌కు SIRపై అవగాహన సదస్సు" మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :...
By Sidhu Maroju 2026-07-01 14:00:24 0 137
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com