"అల్వాల్‌లో యువతి మిస్సింగ్.. ప్రియుడిపైనే తల్లి అనుమానం.?

0
76

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మచ్చ బొల్లారం స్రవంతి నగర్‌లో ఒక యువతి అనుమానాస్పద స్థితిలో కనిపించకుండా పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

స్రవంతి నగర్ ప్లాట్ నెంబర్ 419లో నివాసం ఉంటున్న కొత్తపల్లి మంజుల కుమార్తె సునీత (20) ఈ నెల 19వ తేదీ ఉదయం నుండి అకస్మాత్తుగా అదృశ్యమైంది. 

ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో తల్లి మంజుల స్నానానికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఉన్న సునీత కనిపించకుండా పోయింది. యువతితో పాటు ఆమె బట్టలు, మొబైల్ ఫోన్ కూడా మాయమవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.

బాధిత కుటుంబ సభ్యులు తమకు తెలిసిన ప్రాంతాలతో పాటు సొంత ఊరిలోనూ సునీత కోసం గాలించినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. 

అయితే, గతంలో సునీత తాను ప్రవీణ్ అనే యువకుడిని ప్రేమిస్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ యువతి తల్లి గురువారం సాయంత్రం అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, యువతిని సురక్షితంగా కనిపెట్టేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
విజయ డైరీ మరింత అభివృద్ధి చెందాలి సుజనా చౌదరి
విజయ డైరీ ని మరింత ఆధునీకరించాలి.. డైరీ లో భోగి వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే సుజనా..   ...
By Rajini Kumari 2026-01-14 12:49:30 0 164
Telangana
కోర్టుల కంటే హైడ్రా గొప్పదని భావిస్తున్నారా?"  అంటూ హైడ్రాపై నిప్పులు చెరిగిన హైకోర్టు ‎
కోర్టుల కంటే హైడ్రా ఎక్కువ అనుకుంటున్నారా?  ‎ ‎ప్రభుత్వంతో సమాంతరంగా పని...
By Ponnala Srinivasrao 2026-04-14 05:11:36 0 101
Andhra Pradesh
గుంటూరు సిటీని సర్వనాశనం చేశారు
కేంద్ర మంత్రి పెమ్మసాని గుంటూరు సిటీని సర్వనాశనం చేశారని మాజీమంత్రి అంబటి రాంబాబు విమర్శించారు....
By John Baji 2025-12-30 12:25:46 0 140
Andhra Pradesh
ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిల కోసం రూ. 919 కోట్లు విడుదల చేశాం: సత్యకుమార్.
  ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిల కోసం రూ. 919 కోట్లు విడుదల చేశాం: సత్యకుమార్  Andhra AP...
By Pagadala Venkateswar 2026-05-20 03:46:25 0 28
Andhra Pradesh
శ్రీ అభయాంజనేయ స్వామి వార్షిక తిరుణాల మహోత్సవంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాయచోటి మండలం అబ్బవరం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వార్షిక తిరుణాల మహోత్సవ...
By Benguluri Madhubabu 2026-03-21 07:34:56 0 157
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com