"యాప్రాల్ చెరువు కట్ట వద్ద ఎక్సైజ్ దాడులు: భారీగా గంజాయి, వాహనాలు స్వాధీనం.|

0
67

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : యాప్రాల్ చెరువు కట్ట వద్ద ఆల్వాల్ ఎక్సైజ్ పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో భారీగా గంజాయి పట్టుబడింది. 

మల్కాజిగిరి జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి నవీన్ కుమార్ ఆదేశాలు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి పర్యవేక్షణలో ఆల్వాల్ ఎక్సైజ్ ఎస్హెచ్ఓ బృందం నిన్న సాయంత్రం ఈ ఆపరేషన్ నిర్వహించింది. 

నమ్మదగిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు యాప్రాల్ చెరువు కట్ట వద్ద ఎన్.డి.పి.ఎస్ చట్టం కింద అక్రమంగా గంజాయి రవాణా, విక్రయాలు జరుపుతున్న ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఈ దాడుల్లో నిందితుల నుంచి 2.5 కేజీల ఎండు గంజాయితో పాటు ఐదు మొబైల్ ఫోన్లు, మూడు ఎలక్ట్రిక్ వాహనాలు, ప్యాషన్ ప్లస్ బైక్, టీవీఎస్ ఎన్‌టార్క్, రెండు హోండా యాక్టివా స్కూటర్లతో కలిపి మొత్తం ఏడు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో మొత్తం ఏడుగురిని నిందితులుగా గుర్తించగా, వారిలో బాలాజినగర్‌కు చెందిన భోనాకల్లూరి గణేష్, బల్లెపూళ్ల తరుణ్, కాప్రాకు చెందిన భిశ్వకర్మ విష్ణుకుమార్, వరంగల్ జిల్లా మేకలగట్టుకు చెందిన పుప్పాల చంద్రకాంత్, మెదక్ జిల్లా మొగదుంపల్లెకు చెందిన సత్యరాం అరవింద్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. 

కాగా కొత్తూరు విశాల్, ఆనంద్ అనే మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పట్టుబడిన ఐదుగురు నిందితులను ఎక్సైజ్ అధికారులు రిమాండ్‌కు తరలించారు. 

ఈ విజయవంతమైన దాడుల్లో ఆల్వాల్ ఎక్సైజ్ సిఐ జి. చంద్రశేఖర్, ఇన్స్పెక్టర్ ఎస్. కుమారస్వామి, సబ్ ఇన్స్పెక్టర్ సంధ్యారాణి మరియు సిబ్బంది కీలక పాత్ర పోషించారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
సైబర్ నేరాలపై అవగాహన : కర్నూలు పోలీస్
కర్నూలు :కర్నూల్ జిల్లా...సైబర్ నేరాలు, మహిళల పై జరిగే నేరాల పై అవగాహన...మహిళల భద్రతకు కు పటిష్ట...
By Hari Krishna 2025-12-27 16:20:40 0 251
Andhra Pradesh
స్త్రీ-శక్తి విజయవంతం కావాలంటే బస్సులు, సిబ్బందిని పెంచాలి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'స్త్రీ-శక్తి' ఉచిత ప్రయాణ పథకం విజయవంతం కావాలంటే వెంటనే 3000...
By Pagadala Venkateswar 2026-04-08 05:48:05 0 102
Telangana
రేపే చివరి గడువు మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మిషన్లు
  సూర్యామెహన్ మద్దూర్ మండల్      రేపే చివరి గడువు మద్దూరు ప్రభుత్వ డిగ్రీ...
By Vanmoj Suryamohan 2026-05-06 09:41:36 0 90
Andhra Pradesh
గుంటూరు వెస్ట్ డీస్పీ శ్రీ కె. అరవింద్ గారు విద్యార్థులకు మాదగద్రవ్యాల అవగాహన సదస్సు సంకల్పం కార్యక్రమం చేసినారు. గుంటూరు జిల్లా ఎస్పీ మరియు ఐజి ఆదేశాల మేరకు.
గుంటూరు జిల్లా పోలీస్...* *పట్టాభిపురం పోలీస్ స్టేషన్* *తేది: 31.12.2025* _*//“డ్రగ్స్...
By KOTESWARARAO KVSR 2025-12-31 12:18:11 0 517
Media Academy
Digital Journalism: Telling Stories in a Modern World
Digital Journalism: Telling Stories in a Modern World The world has gone digital—and so...
By Media Academy 2025-04-29 08:15:04 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com