రోడ్డు పక్కన తాటి ముంజలను ఆస్వాదించిన చంద్రబాబు, భువనేశ్వరి.

0
70

నేడు కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబు, భువనేశ్వరి

తాటి ముంజలు అమ్ముతున్న వ్యక్తుల వద్ద ఆగిన చంద్రబాబు దంపతుల వాహనం

సాక్షాత్తు సీఎం తన వద్దకు రావడంతో ఆనందంలో మునిగిపోయిన తాటి ముంజలు అమ్ముతున్న వ్యక్తులు

కుప్పం ప్రజల మనసుల్లాంటి స్వచ్ఛమైన తాటి ముంజలు అంటూ సీఎం ట్వీట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి గ్రామీణ జీవనశైలికి, సామాన్య ప్రజలకు తాము ఎంత దగ్గరో నిరూపించే ఒక అరుదైన, ఆహ్లాదకరమైన క్షణాన్ని పంచుకున్నారు. ఈరోజు కుప్పం పర్యటనకు వెళ్తున్న క్రమంలో, రహదారి పక్కన తాటి ముంజలు అమ్ముతున్న వ్యక్తుల వద్ద సీఎం దంపతుల వాహనం ఆగింది. వారు స్వయంగా కారు దిగి, వారి వద్ద తాటి ముంజలను కొనుగోలు చేయడమే కాకుండా, అక్కడే నిలబడి ఎంతో ఆప్యాయంగా తింటూ ముచ్చటించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన వద్దకు వచ్చి సాదాసీదాగా మాట్లాడటంతో ఆ కార్మికుడు ఆనందంలో మునిగిపోయాడు.

 

 

ఈ అరుదైన క్షణాన్ని చంద్రబాబు ఎక్స్ వేదికగా పంచుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "కల్తీ లేదు... కార్బైడ్ లేదు.. పురుగు మందుల గోల లేదు.. మా కుప్పం ప్రజల మనసుల్లాంటి స్వచ్ఛమైన, చల్లనైన తాటి ముంజలు రోడ్డు పక్కన ఆగి తింటుంటే ఎంతో హాయిగా ఉంది" అంటూ ఆయన రాసుకొచ్చారు. ఈ సందర్భంగా తాటి ముంజలు అమ్మే వ్యక్తి కుటుంబ పరిస్థితులు, వ్యాపారం, యోగక్షేమాల గురించి సీఎం దంపతులు అడిగి తెలుసుకున్నారు. సీఎం దంపతులు చూపిన ఈ నిరాడంబరత, అప్యాయతలపై స్థానికులు ప్రశంసలు కురిపించగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Search
Categories
Read More
Tamilnadu
Amit Shah Never Spoke of Coalition Government in Tamil Nadu, Says EPS
AIADMK General Secretary and former Chief Minister Edappadi K. Palaniswami clarified during a...
By Bharat Aawaz 2025-07-17 07:57:40 0 1K
Andhra Pradesh
మినీ అంగన్‌వాడీలకు పదోన్నతి: 39 మందికి ఉత్తర్వుల పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే ముత్తుముల.
కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ...
By John Baji 2026-01-03 02:10:52 0 197
SURAKSHA
Sanjay Jaju, IAS: Architect of Good Governance
The Administrator Shaping Telangana's Future Through Visionary Leadership    "True...
By Lokeshwari Panthadi 2026-07-09 06:10:45 0 109
Andhra Pradesh
ప్రజా సమస్యల పరిష్కారమే నా తొలి ప్రాధాన్యత
ప్రజా సమస్యల పరిష్కారమే నా తొలి ప్రాధాన్యత దర్శి టిడిపి కార్యాలయం లో ప్రజల నుండి వివతి పత్రాలు...
By Chennaiah Kati 2026-07-05 14:24:33 0 59
Andhra Pradesh
రీసర్వేలో నిర్లక్ష్యం వద్దు: ఎమ్మార్వో
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో పార్వతి సోమవారం మండల వీఆర్వోలు,...
By Kothuru Murali 2026-01-13 09:00:49 0 183
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com