ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పకడ్బందీగా మక్కజొన్నలు, ధాన్యం కొనుగోళ్లు,తరలింపు,*

0
50

ప్రెస్ రిలీజ్ 

మే 20, బుధవారం

మహబూబాబాద్ జిల్లా, 

 

 

*ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పకడ్బందీగా మక్కజొన్నలు, ధాన్యం కొనుగోళ్లు,తరలింపు,*

 

*మక్కజొన్నలు 82వేల 363.900 మెట్రిక్ టన్నులు, 16 లక్షల 47వేల 278 బస్తాల తరలింపు,*

 

*ధాన్యం 89వేల మెట్రిక్ టన్నుల కొనుగోలు, 73 వేల మెట్రిక్ టన్నుల తరలింపు,*

 

*స్వయంగా పర్యటిస్తూ ప్రత్యేక అధికారులకు సూచనలు జారీ చేస్తూ నిరంతరం రైతులకు అందుబాటులో జిల్లా కలెక్టర్, యంత్రాంగం

 

రైతులకు ఇబ్బందులు కలిగిస్తే విధులలో తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటాం,

 

జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్,

 

ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ క్షేత్రస్థాయిలో కలెక్టర్ నుంచి కిందిస్థాయి అధికారి వరకు ఆకస్మికంగా పర్యటనల ద్వారా రికార్డు స్థాయిలో జిల్లాలో మక్కజొన్నలు, ధాన్యం కొనుగోళ్ల విషయంలో పక్కా ప్రణాళిక అమలు చేస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకొని గత వారం రోజుల్లో 13 వేల 434 మంది రైతుల (214) కేంద్రాల నుండి 97 వేల 246 మెట్రిక్ టన్నుల ధాన్యంకు గాను 89వేల టన్నుల ధాన్యాన్ని సేకరించి,73 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులు, గోదాములకు తరలించడం జరిగింది.

ప్రాథమిక సహకార సొసైటీ, ఐకెపి, గిరిజన కార్పొరేషన్, మెప్మాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రక్రియను పూర్తిగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పర్యవేక్షిస్తూ అధిక హమాలీలను, లారీలను, ట్రాక్టర్స్, ఏర్పాటుచేసి పరిసర ప్రాంతాలలో ఉన్న మిల్లులు గోదాములలోకి తరలించడం కోసం జిల్లా యంత్రాంగం తో పాటు పోలీస్ యంత్రాంగం ప్రత్యేకంగా కృషి చేసిందని, ప్రతి కేంద్రంలో అన్ని మౌలిక వసతులు త్రాగునీరు, టెంట్ లు, చేర్లు వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచుతూ, రవాణా చేయు సందర్భములలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ విధంగా ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు,మక్కజొన్నలు జిల్లా లక్ష్యం 1 లక్ష, 37వేల 910 మెట్రిక్ టన్నులు కాగా ఇప్పటివరకు 82 వేల 363 .900 మెట్రిక్ టన్నుల మక్కజొన్నలు 16వేల 059 మంది రైతుల నుండి 16 లక్షల 47 వేల 278 మక్కల బ్యాగులను ఊహించని విధంగా రికార్డు స్థాయిలో కొనుగోలను చేసి తరలించడం జరిగింది, రైతులకు ఇబ్బందులు లేకుండా జిల్లా లో మార్క్ఫెడ్, సంబంధిత అధికారులతో కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అటు సెంటర్ నిర్వాహకులు ఇటు అధికారుల తో సమన్వయపరుస్తూ కొనుగోళ్లలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

 

రానున్న వారం రోజుల్లో పూర్తిస్థాయిలో మక్క జొన్న, ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం పూర్తి చేయుటకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు.

Search
Categories
Read More
Kerala
Kerala HC Demands Government Revive Dog-Bite Compensation Panel
The Kerala High Court has directed the state government to decide on reactivating the Siri Jagan...
By Bharat Aawaz 2025-07-17 06:57:37 0 2K
Andhra Pradesh
నేటి అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనములు
*నేటి అర్ధరాత్రి నుంచి తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు!*   తిరుపతి:డిసెంబర్ 29...
By Rajini Kumari 2025-12-30 10:33:43 0 179
Business
Advancing postal cooperation for a more connected world!
Secretary (Posts), Ms. Vandita Kaul led the Indian delegation at the Pan African Postal Union...
By Bharat Aawaz 2025-07-02 17:43:35 0 2K
Telangana
సెప్టెంబర్‌లో "బతుకమ్మ" OTT సినిమా
రచయిత మరియు దర్శకుడు గా "బతుకమ్మ "టైటిల్ తో సినిమా త్వరలో చేయబోతున్నట్టు శ్రీను రావు పొన్నాల...
By Ponnala Srinivasrao 2026-04-05 03:11:51 0 235
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com