పవన్ కల్యాణ్ పై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు.

0
34

Andhra

Pawan Kalyan Interesting comments by Niharika

పిఠాపురం ప్రజలను సొంత కుటుంబంలా చూసుకుంటారన్న నిహారిక

ఎలక్ట్రిషియన్ విద్యుదాఘాతంతో చనిపోతే స్పందించారని వెల్లడి

325 మందికి సేఫ్టీ కిట్ అందజేసినట్లు వెల్లడి

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మెగా డాటర్ కొణిదెల నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. పిఠాపురం నియోజకవర్గం ప్రజలను ఆయన తన సొంత కుటుంబంలా చూసుకుంటున్నారని అన్నారు. పిఠాపురం వెళితే తనకు తన సొంతూరుకు వెళ్ళినట్లుగా అనిపిస్తుందని అన్నారు.

 

తన నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు ఒక ఎలక్ట్రిషియన్ విద్యుదాఘాతంతో చనిపోతే నియోజకవర్గంలోని ఎలక్ట్రిషియన్లందరికీ పవన్ కల్యాణ్ సేఫ్టీ కిట్లు అందజేశారని తెలిపారు. మొత్తం 325 మందికి భద్రతా కిట్లను అందజేసినట్లు వెల్లడించారు. ప్రజా సమస్యల పట్ల సకాలంలో స్పందించడంలో ఆయనకు ఎవరూ సాటిరారని అన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
దర్శి మున్సిపల్ పరిధిలో, గురువారం సాయంత్రం దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు అధికారులతో కలిసి దర్శి పట్టణం, అద్దంకి రోడ్డులోని జోముకాలువ నిర్మాణానికి సంబంధించి
దర్శి మున్సిపల్ పరిధిలో, గురువారం సాయంత్రం దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి...
By Chennaiah Kati 2026-01-30 06:15:14 0 197
Maharashtra
महाराष्ट्रातील काही शाळांना पावसामुळे आणि सणांमुळे सुट्टी
१२ सप्टेंबर २०२५ रोजी महाराष्ट्रातील काही भागांतील शाळांना पावसामुळे आणि स्थानिक...
By Pooja Patil 2025-09-12 06:30:14 0 259
Telangana
నష్ట పరిహారం కోసం రైతు వినూత్న నిరసన
నష్ట పరిహారం కోసం రైతు వినూత్న నిరసన   సారు మా పై దయాచూపండి     ...
By Vanmoj Suryamohan 2026-01-12 15:08:58 0 395
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com