రేపు చంద్రబాబు కావలి పర్యటన షెడ్యూల్ ఇదిగో!

0
92

Andhra

Chandrababu Naidu Kavali visit schedule

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

'మత్స్యకార సేవలో' కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి

తుమ్మలపెంట గ్రామంలో బహిరంగ సభ, నిధుల విడుదల

మత్స్యకార కుటుంబాలతో భేటీ, టీడీపీ శ్రేణులతో సమీక్ష

ఆంధ్రప్రదేశ్‌లోని మత్స్యకారుల కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోంది. వేట నిషేధ కాలంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా మత్స్యకారులను ఆదుకునేందుకు అమలు చేస్తోన్న ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద వరుసగా రెండో ఏడాది ఆర్థిక సాయం అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం మత్య్సకారుల ఖాతాల్లో జమ చేయనుంది. నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు విడుదల చేయనున్నారు.

 

ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొని, మత్స్యకార కుటుంబాలతో ముఖాముఖి భేటీ కానున్నారు.

 

అధికారిక షెడ్యూల్ ప్రకారం, ముఖ్యమంత్రి ఉదయం 9:30 గంటలకు అమరావతిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరుతారు. ఉదయం 10:30 గంటలకు కావలి మండలం తుమ్మలపెంట గ్రామానికి చేరుకుంటారు. ఉదయం 10:45 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొని, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయనున్నారు. 

 

మధ్యాహ్నం 1:15 గంటలకు తుమ్మలపెంట గ్రామంలోని మత్స్యకార కుటుంబాలతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమవుతారు. వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ శ్రేణులతో నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ ముగించుకుని సాయంత్రం 4:45 గంటలకు తిరిగి అమరావతికి పయనమవుతారు.

Search
Categories
Read More
SURAKSHA
AP పోలీసులు నేడు: రోడ్డు భద్రత కాపలాదారులుగా
నేడు AP ట్రాఫిక్ పోలీసులు ప్రాణాలు కాపాడే పనిలో ఉన్నారు. విజయవాడ, తిరుపతి, విశాఖ స్కూల్ జోన్లలో...
By Kalaga Sailaja 2026-07-04 09:28:39 0 58
Andhra Pradesh
మదనపల్లి ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ.
మదనపల్లి మండలంలోని సీటీఎం పీహెచ్‌సీని అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్...
By Pagadala Venkateswar 2026-01-31 07:51:38 0 167
Andhra Pradesh
జనవరి 3న వ్యవసాయ శాఖ మంత్రి కర్నూలు జిల్లాలో పర్యటన :
కర్నూలు : జనవరి 3 వ తేదీన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఉల్లి పంట...
By Hari Krishna 2025-12-31 11:05:33 0 354
Andhra Pradesh
మదనపల్లి రోడ్డు ప్రమాదంలో ముగ్గరికి తీవ్ర గాయాలు.
మదనపల్లెలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు....
By Pagadala Venkateswar 2026-03-25 05:32:16 0 175
Telangana
గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి cc రోడ్డు ప్రారంభం
తలకొండపల్లి మండలం లోని పడకల్ గ్రామంలో సర్పంచ్ డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి చేసే అభివృద్ధి లో...
By MERIGE MALLESH 2026-03-28 09:59:04 0 351
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com