రేపు చంద్రబాబు కావలి పర్యటన షెడ్యూల్ ఇదిగో!

0
38

Andhra

Chandrababu Naidu Kavali visit schedule

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

'మత్స్యకార సేవలో' కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి

తుమ్మలపెంట గ్రామంలో బహిరంగ సభ, నిధుల విడుదల

మత్స్యకార కుటుంబాలతో భేటీ, టీడీపీ శ్రేణులతో సమీక్ష

ఆంధ్రప్రదేశ్‌లోని మత్స్యకారుల కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోంది. వేట నిషేధ కాలంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా మత్స్యకారులను ఆదుకునేందుకు అమలు చేస్తోన్న ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద వరుసగా రెండో ఏడాది ఆర్థిక సాయం అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం మత్య్సకారుల ఖాతాల్లో జమ చేయనుంది. నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు విడుదల చేయనున్నారు.

 

ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొని, మత్స్యకార కుటుంబాలతో ముఖాముఖి భేటీ కానున్నారు.

 

అధికారిక షెడ్యూల్ ప్రకారం, ముఖ్యమంత్రి ఉదయం 9:30 గంటలకు అమరావతిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరుతారు. ఉదయం 10:30 గంటలకు కావలి మండలం తుమ్మలపెంట గ్రామానికి చేరుకుంటారు. ఉదయం 10:45 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొని, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయనున్నారు. 

 

మధ్యాహ్నం 1:15 గంటలకు తుమ్మలపెంట గ్రామంలోని మత్స్యకార కుటుంబాలతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమవుతారు. వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ శ్రేణులతో నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ ముగించుకుని సాయంత్రం 4:45 గంటలకు తిరిగి అమరావతికి పయనమవుతారు.

Search
Categories
Read More
Telangana
సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.
మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న మల్కాజిగిరి...
By Sidhu Maroju 2025-06-21 17:20:38 0 1K
Andhra Pradesh
గుంటూరులో జరిగినటువంటి కార్యక్రమంలో విద్యార్థులు సైబర్ నేరాల పట్ల తప్పనిసరిగా అవగాహన ఉండాలని ఐదవ అదనపు సివిల్ జడ్జి శ్రీమతి లతా గారు అన్నారు.
  <>kvsr. కోటేశ్వరరావు. గుంటూరు. రిపోర్టర్.   *గుంటూరు, జనవరి 24 :...
By KOTESWARARAO KVSR 2026-01-24 13:00:35 0 416
Andhra Pradesh
బి కొత్తకోట : యువతి అదృశ్యంపై కేసు నమోదు.
కొత్తకోటలోని బిసికాలనీలో మహమ్మద్ హుస్సేన్ కుమార్తె ఆర్షియా (18) అదృశ్యమైంది. ఇంటర్మీడియట్ వరకు...
By Pagadala Venkateswar 2026-02-08 11:09:42 0 133
Andhra Pradesh
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు...
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు జిల్లాలో మహిళల భద్రత,...
By Gadiyapudi Narendra 2026-01-10 12:03:32 0 482
Andhra Pradesh
సోమల లో హిందూ సమ్మేళనం
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో ఆదివారం నిర్వహించిన హిందూ సమ్మేళనంలో వక్తలు హైందవ ధర్మాన్ని...
By Kothuru Murali 2026-01-04 11:04:19 0 157
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com