రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం, రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం మైలారం గ్రామంలో రైతు అవగాహన కార్యక్రమం చేపట్టారు.రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పూర్తి అవగాహన కల్పించడం, వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా సంబంధిత శాఖ అధికారులు పాల్గొని, రైతులకు మక్క,వరి, పత్తి , కూరగాయల మరియు ఇతర పంటల సాగు పద్ధతులు,ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పాటించాల్సిన వ్యవసాయ విధానాలపై రైతులకు తెలియపరిచారు. అలాగే పంటల పరిరక్షణ, నీటి సమర్థ వినియోగం, ఆధునిక వ్యవసాయ యంత్రాల వినియోగంపై ప్రత్యేక అవగాహన కల్పించి, పంటలపై రసాయనాల వినియోగాన్ని తగ్గించి, ప్రకృతికి నష్టం కలిగించకుండా సేంద్రీయ ఎరువులు వాడి ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, గ్రామ సర్పంచ్ మరియు రైతులు పాల్గొన్నారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz