రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం, రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

0
1K

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం మైలారం గ్రామంలో రైతు అవగాహన కార్యక్రమం చేపట్టారు.రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పూర్తి అవగాహన కల్పించడం, వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా సంబంధిత శాఖ అధికారులు పాల్గొని, రైతులకు మక్క,వరి, పత్తి , కూరగాయల మరియు ఇతర పంటల సాగు పద్ధతులు,ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పాటించాల్సిన వ్యవసాయ విధానాలపై రైతులకు తెలియపరిచారు. అలాగే పంటల పరిరక్షణ, నీటి సమర్థ వినియోగం, ఆధునిక వ్యవసాయ యంత్రాల వినియోగంపై ప్రత్యేక అవగాహన కల్పించి, పంటలపై రసాయనాల వినియోగాన్ని తగ్గించి, ప్రకృతికి నష్టం కలిగించకుండా సేంద్రీయ ఎరువులు వాడి ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, గ్రామ సర్పంచ్ మరియు రైతులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీలో స్థానిక ఎన్నికల కసరత్తు.. సెప్టెంబర్‌లో నోటిఫికేషన్!.
సెప్టెంబర్‌లో నోటిఫికేషన్, డిసెంబర్‌లోగా ఎన్నికల పూర్తికి ప్రణాళిక ఎన్నికల ఏర్పాట్లపై...
By Pagadala Venkateswar 2026-05-13 06:11:12 0 82
Andhra Pradesh
సామర్లకోట: హై వోల్టేజ్ త్రీఫేజ్ పవర్ సరఫరా కట్
సామర్లకోట పట్టణంలో హై వోల్టేజ్ కారణంగా విద్యుత్ పరికరాలు పలుచోట్ల భారీ నష్టం వాటిల్లింది. స్థానిక...
By Ratna Sekhar 2026-02-11 14:26:06 0 301
Andhra Pradesh
ప్రతి అక్కా చెల్లెమ్మలకు తోడుగా ఉంటాం - మద్దులూరి మహేంద్రనాథ్
నేడు చీరాలలో ఒక పాఠశాల ప్రారంభం చేసేందుకు వెళ్లిన చీరాల అధికార ప్రతినిధి మహేంద్రనాథ్ కు ఓ మహిళ...
By Vadlamudi NagaVenkat 2026-03-08 14:24:42 0 1K
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: క్షుద్ర పూజలతో అదిరిపడ్డ ప్రజలు
శుక్రవారం, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, ఆమినిగుంట గ్రామ సమీపంలో పులికోన వద్ద క్షుద్ర...
By Kothuru Murali 2026-02-28 12:57:30 0 119
Mizoram
Rural Healthcare Infrastructure Expansion Strengthens Mizoram
Mizoram continues to strengthen its rural healthcare infrastructure through the expansion of...
By Fathima Safa 2026-06-25 05:22:46 0 58
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com