అరణ్య శ్రీ ద్వారా డ్వాక్రా మహిళలలకు ఆర్ధికాభివృద్ధి: కలెక్టర్ దినేష్ కుమార్!
Posted 2026-05-16 18:36:43
0
196
గిరిజన ప్రాంత మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా సరికొత్త అడుగు పడింది. 'అరణ్య శ్రీ' కార్యక్రమం ద్వారా ద్వాక్రా మహిళలకు భారీ లబ్ధి చేకూరనుందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. శనివారం చింతూరు మండలం గొందిగూడెంలో ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అటవీ సంరక్షణతో పాటు స్థానిక మహిళలకు ఉపాధి కల్పించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రక్షిత అటవీ ప్రాంతాల్లో సహజసిద్ధంగా పెరిగిన వెదురును విక్రయించగా వచ్చే ఆదాయంలో.. సగం ఆదాయాన్ని (50% షేర్) నేరుగా మహిళలకే అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు.11 గిరిజన గ్రామాలకు చెందిన 119 డ్వాక్రా సంఘాలలో సభ్యులుగా ఉన్న 1154 మంది మహిళలకు ఆదాయం లభిస్తుందని తెలిపారు.
# Yadagiri
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆర్డీటీ మనందరి సంస్థ.. రాజకీయాలకు అతీతంగా అండగా నిలుద్దాం: మంత్రి నారా లోకేష్.
ఆర్డీటీ మనందరి సంస్థ.. రాజకీయాలకు అతీతంగా అండగా నిలుద్దాం: మంత్రి నారా లోకేష్...
Punjab Boosts Sports Development and Youth Excellence
Punjab continues to strengthen its sporting ecosystem by investing in modern sports...
పుంగనూరు నియోజకవర్గం:రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండల సరిహద్దులో ఉన్న రేగల్లుకు చెందిన ముగ్గురు గురువారం అర్ధరాత్రి...
టీటీడీ చైర్మన్ వ్యవహార శైలిపై నిరసన
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారశైలిపై మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి...
Justice for Sale: When Police department Silence Turns Public Suffering into Paid Packages
Is the police department today a symbol of confidence—or a source of fear?...