మచిలీపట్నంలో మైనర్ బాలికపై అసభ్యకరమైన ప్రవర్తన కేసుకు సిద్ధమైన పోలీసులు

0
65

మచిలీపట్నంలో మైనర్ బాలికపై అసభ్య ప్రవర్తన.. ఫోక్సో కేసుకు సిద్ధమైన పోలీసులు

 

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించిన వివరాలను బాలిక రెండు రోజుల తర్వాత తన తల్లికి చెప్పడంతో విషయం బయటపడింది.

పోలీసుల వివరాల ప్రకారం.. మచిలీపట్నం నిజాంపేట ప్రాంతంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న కుటుంబానికి చెందిన మైనర్ బాలికపై ఇంటి యజమాని అల్లుడు కొన్ని రోజులుగా వేధిస్తున్నట్లు సమాచారం. బాలికను మాయ మాటలతో లొంగదీసుకునేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలిక పట్ల అతడు అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. అయితే బాలిక అతడి చెర నుంచి తప్పించుకుని బయటకు పరుగులు తీసింది. జరిగిన విషయాన్ని బాలిక శుక్రవారం తన తల్లికి వివరించడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.

తల్లి వెంటనే చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు. బాలిక వాంగ్మూలం ఆధారంగా నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Search
Categories
Read More
Telangana
Palamooru rangareddy project
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన...
By G k Nookala 2026-05-19 08:50:58 0 41
Andhra Pradesh
నిమ్మనపల్లి లో తాగునీటి కోసం ఘర్షణ – నలుగురికి గాయాలు.
మంగళవారం నిమ్మనపల్లె మండలంలోని బాలినాయునిపల్లె పంచాయతీ కత్తిరివాండ్లపల్లెలో తాగునీటి వివాదం...
By Pagadala Venkateswar 2026-04-01 04:54:52 0 114
Andhra Pradesh
టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ 50వేల రూపాయలు విరాళం ఇచ్చారు.
శ్రీశ్రీశ్రీ మాతా బంగారం అవ్వ దేవి దేవాలయం నూతన గోపుర కలశం మరియు ముఖద్వారం ప్రతిష్ట మరియు...
By Boya Dasthagiri 2026-03-28 08:23:17 0 253
Telangana
మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
హైదరాబాద్: సికింద్రాబాద్ లో నూతనంగా నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,...
By Sidhu Maroju 2025-09-16 16:52:28 0 256
Andhra Pradesh
TTD SV విద్యా ధ్యాన ట్రస్ట్ కు 1 కోటి విరాళం
టీటీడీ ఎస్వీ విద్యాదాన ట్రస్ట్ కు రూ 1 కోటి విరాళం   క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ బిఆర్...
By Rajini Kumari 2025-12-31 10:25:04 0 188
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com