భూమి రికార్డుల తారుమారు కలెక్టర్‌కు బాధితుడి మొర

0
262

బాపట్ల, 

సొంత భూమికి సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో జరిగిన అవకతవకలపై బాపట్ల జిల్లా కలెక్టర్‌కు ఓ రైతు ఫిర్యాదు చేశారు. రిజిస్ట్రేషన్ పత్రాల్లో సక్రమంగా ఉన్న భూమి, ఆన్‌లైన్ రికార్డులకు వచ్చేసరికి గందరగోళంగా మారిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. బాపట్ల జిల్లా అన్నం బోట్లవారి పాలెం గ్రామానికి చెందిన రైతు తూబాటి శివకోటేశ్వరరావుకు గ్రామంలోని సర్వే నంబర్ 213 సి లో 1 ఎకరం 39 సెంట్ల మెట్ట భూమి ఉంది. రిజిస్టర్ రికార్డుల ప్రకారం ఈ భూమి ఆయన పేరు మీదే ఉన్నప్పటికీ, ఆన్‌లైన్ (వెబ్ ల్యాండ్ ) రికార్డుల్లో మాత్రం తప్పుగా నమోదైందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సర్వే నంబర్ 213 ఎ లో 0.39 సెంట్లు మీద, 213 బి లో 0.39 సెంట్లు మీద ఆన్‌లైన్‌లో నమోదై ఉన్నాయని, అయితే తన రికార్డుల్లో ఉండాల్సిన 1.39 ఎకరాలకు గాను కేవలం 0.68 సెంట్లు మాత్రమే చూపిస్తోందని బాధితుడు వివరించారు.

రికార్డుల తారుమారుని సాకుగా చూపి, కొంతమంది వ్యక్తులు తన భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని శివకోటేశ్వరరావు ఆరోపించారు. తన పొలానికి పక్కనే ఉన్న చెన్నపాటి కోట సుబ్బారావు, చెన్నపాటి అంకమ్మ, చెన్నపాటి ధర్మ, ముక్కా శ్రీను తదితరులు గట్టు పంచాయితీలు సృష్టించి, మట్టి తోలుతూ తన భూమిని ఆక్రమించేందుకు అడ్డుపడుతున్నారని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

తక్షణమే స్పందించి తన భూమి రికార్డులను సరిచేసి, ఆక్రమణదారుల నుండి తనకు, తన భూమికి రక్షణ కల్పించాలని ఆయన జిల్లా అధికారులను కోరారు.

Search
Categories
Read More
Telangana
ఆరెకుల సంఘం నూతనకార్యవర్గం
  వరంగల్ జిల్లా  ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు గీసుగోండ మండలo...
By Gujile Ramu 2026-04-23 07:39:34 0 234
Andhra Pradesh
రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పరిగి పర్యవేక్షించిన మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎస్పీ గారు
రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించిన మార్కాపురం జిల్లా...
By Chennaiah Kati 2026-06-22 16:48:16 0 58
Andhra Pradesh
పుంగనూరు: బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ రోడ్డుపై నిరసన
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణం ఎన్ఎస్ పేటకు చెందిన అక్రమ్, గుజరాత్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదంలో...
By Kothuru Murali 2026-06-16 13:55:47 0 73
SURAKSHA
Shashi Bhushan Kumar IAS: Driving Rural Development
A distinguished Andhra Pradesh cadre IAS officer whose leadership in rural development,...
By Lokeshwari Panthadi 2026-07-16 07:35:13 0 30
Andhra Pradesh
డోన్ పట్టణంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
కర్నూలు : నంద్యాల జిల్లా : డోన్ : ద్రోణాచలం :  డోన్ పట్టణంలోని 9వ వార్డులో ప్రజల సమస్యలను...
By Hari Krishna 2025-12-23 14:11:52 0 239
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com