ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్

0
112

అధికారులే మీ వద్దకు.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్

కంచికచర్ల మండలం వేములపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధికారులు, కూటమి నేతలతో కలిసి పాల్గొన్నారు. గ్రామ ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా పెన్షన్లు, గృహ నిర్మాణం, రేషన్, మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా తక్షణమే పరిష్కార దిశగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వ పాలనలో లక్షల కోట్ల అప్పులతో సంక్షోభంలో పడిందని పేర్కొన్న ఎమ్మెల్యే, ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తోందన్నారు. పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపుతున్నాయని, అభివృద్ధి మరియు సంక్షేమాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారేనని కొనియాడారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి గ్రామానికి పరిపాలనను తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీల రాష్ట్ర ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, అధికారులు మరియు కూటమి నేతలు, స్థానిక ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
మచ్చ బొల్లారంలో భక్తి శ్రద్ధలతో బొడ్రాయి పండుగ.. అల్వాల్ ల్లో ఘనంగా అంబేద్కర్ జయంతి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మచ్చబొల్లారం ప్రాంతంలో షీతలమ్మ – బొద్రాయి పండుగ 2వ...
By Sidhu Maroju 2026-04-14 17:42:55 0 134
Telangana
హైదరాబాద్‌లో కురిసిన వర్షం నగర వాతావరణాన్ని మారుస్తూ చల్లని గాలులను తెచ్చింది.
హైదరాబాద్‌-నిన్న రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హైదరాబాద్, రంగారెడ్డి,...
By Bharat Aawaz 2025-08-12 06:20:09 0 686
Andhra Pradesh
గంజాయితో జీవితాలు నాశనం
గంజాయితో జీవితాలు నాశనం అవుతాయని బొబ్బిలి పట్టణ సీఐ నారాయణరావు అన్నారు. బొబ్బిలి మండలం పారాది...
By Boiena Rajesh 2026-04-08 01:01:39 0 130
Telangana
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు
   హైదరాబాద్: 50% రిజర్వేషన్లు దాటకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు...
By Sidhu Maroju 2025-10-16 07:46:00 0 250
Telangana
మైనంపల్లి మార్క్ డెవలప్‌మెంట్: ముక్తిధామం క్లీన్ అండ్ గ్రీన్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  ఈరోజు మల్కాజిగిరి ఇన్‌చార్జ్ మైనంపల్లి హనుమంతరావు...
By Sidhu Maroju 2026-04-07 12:17:04 0 180
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com