ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్

0
257

అధికారులే మీ వద్దకు.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్

కంచికచర్ల మండలం వేములపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధికారులు, కూటమి నేతలతో కలిసి పాల్గొన్నారు. గ్రామ ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా పెన్షన్లు, గృహ నిర్మాణం, రేషన్, మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా తక్షణమే పరిష్కార దిశగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వ పాలనలో లక్షల కోట్ల అప్పులతో సంక్షోభంలో పడిందని పేర్కొన్న ఎమ్మెల్యే, ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తోందన్నారు. పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపుతున్నాయని, అభివృద్ధి మరియు సంక్షేమాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారేనని కొనియాడారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి గ్రామానికి పరిపాలనను తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీల రాష్ట్ర ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, అధికారులు మరియు కూటమి నేతలు, స్థానిక ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: ఎడపల్లిలో తైబజార్ వేలుమ్ రద్ధు.
ఎడపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఇటి వల నిర్వాహిoచిన తైబజార్ వెలాన్నీ అధికారులు రాధుచేషారు. ఇమెరాకు...
By Sadaq Sadaq 2026-04-07 17:48:03 0 177
Bihar
Foundation Stone Fast-Tracked for Muzaffarpur Airport
Commercial aviation in North Bihar is set for a massive upgrade as final clearances move forward...
By Lokeshwari Panthadi 2026-06-26 12:47:38 0 55
Andhra Pradesh
కొత్తపల్లి గ్రామంలో పొలాల్లో 10 బోరు మోటర్లు చోరీ
పుంగనూరు మండలం కొత్తపల్లి గ్రామంలో గుర్తు తెలియని దుండగులు పొలాల్లోని 10 బోరు మోటర్ల వైర్లను చోరీ...
By Kothuru Murali 2026-01-02 13:12:37 0 195
Andhra Pradesh
చీరాలలో దివ్యాంగుల గర్జన * సొంత ఇళ్లు కల్పించాలని ప్రభుత్వానికి విన్నపం
చీరాల పట్టణంలోని ఎన్.ఆర్.పి.ఎం హైస్కూల్ ఆవరణలో గల ఓపెన్ ఎయిర్ థియేటర్ లో దివ్యాంగుల పోరాట సమితి...
By Vadlamudi NagaVenkat 2026-03-07 16:54:31 0 523
Andhra Pradesh
పుంగనూరు: పోలీసుల అదుపులో నిందితుడు కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మార్కెట్ యార్డు వద్ద శనివారం సాయంత్రం టమాటా లోడ్ కోసం వచ్చిన ఇద్దరు...
By Kothuru Murali 2026-05-16 16:01:07 0 89
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com