రైతులు నూతన పద్ధతులను పాటించాలి, వ్యవసాయ శాస్త్రవేత్తలు

0
74

సూర్యాపేట జిల్లా, చిలుకూరు మండలం, బేతవోలు గ్రామంలోని రైతు వేదికలో వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ పి. రాజనీకాంత్, డాక్టర్ ఎస్. శ్రీనివాస్ నేతృత్వంలో 'రైతు ముంగింట్లో శాస్త్రవేత్తలు' కార్యక్రమం జరిగింది. వానాకాలం సీజన్‌కు ముందు రైతులు విత్తన రకాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను మరియు రసాయన ఎరువుల (ముఖ్యంగా యూరియా) మితిమీరిన వాడకం వల్ల నేల సారం తగ్గిపోతుందని, దీనివల్ల కలిగే అనర్థాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. రసాయన పిచికారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నూతన వరి వంగడాలు, సేంద్రియ వ్యవసాయం, పంట మార్పిడిపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీధర్ మరియు నీటిని పొదుపుగా వాడుకుంటూ, పంటల సాగును ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు చంద్ర శేఖర్, శిరీష, వసీమ మరియు రైతులు పాల్గొని శాస్త్రవేత్తలతో ముఖాముఖి చర్చించారు.

Search
Categories
Read More
Telangana
కరీంనగర్ తెలంగాణ చౌక్ బస్టాప్ షేడ్స్ నిరుపయోగం.
కరీంనగర్ జిల్లా.  కరీంనగర్ తెలంగాణ చౌక్ లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ...
By Thalakokkula Sadanandam 2026-03-19 23:00:39 0 408
Andhra Pradesh
అల్లు శిరీష్ కళ్యాణ మహోత్సవానికి నారా లోకేష్
*సినీ హీరో అల్లు శిరీష్ వివాహ వేడుకకు హాజరైన మంత్రి లోకేష్*   *హైదరాబాద్:*  ప్రముఖ...
By Rajini Kumari 2026-03-09 13:00:17 0 131
Andhra Pradesh
100 రోజుల ప్రణాళిక,!! సెట్కూర్ CEO
కర్నూలు : వంద రోజుల ప్రణాళిక అమలు కావాలి: సెట్కూరు సీఈఓ.. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్ఏపీ క్యాంప్...
By Hari Krishna 2025-12-21 14:02:53 0 146
Telangana
పెద్దపల్లి వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు.
  పెద్దపల్లి మండలం లోని పలు గ్రామాల శివారుల్లో పెద్దపల్లి రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో ఎస్ ఐ...
By MOHAMMAD MUJEEBUDDIN 2026-04-04 16:32:17 0 377
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com