ఇప్పుడే అరెస్టు వద్దు.. ఎవరూ మాట్లాడొద్దు!

0
107

బాధితురాలు మైనర్‌గా తేలడంతో బీజేపీ నేత బండి సంజయ్‌ కుమారుడు సాయి భగీరథ్‌(భగ్గీ) కనిపించడం లేదు. ఆయన సోషల్‌ మీడియా అకౌంట్స్‌ అన్నీ హైడ్‌ అయిపోగా, ఫోన్‌ స్విచ్ఛాఫ్‌లో ఉన్నది. పోక్సో కేసు నమోదు కావడంతో అతను పారిపోయినట్టు సాక్షాత్తూ పోలీసులే చెబుతున్నారు. అయితే, గతంలో ఏ నేరం జరిగినా నిమిషాలు, గంటల వ్యవధిలో నిందితులను అదుపులోకి తీసుకొని విచారించే పోలీసులే.. ఇప్పుడు కావాలనే నిందితుడిని పట్టుకోవడం లేదని స్పష్టమవుతున్నది.

‎ఆదివారం ఉదయం నుంచే భగీరథ్‌ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వస్తుండటం మరిన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే తండ్రి సాక్షాత్తూ కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కావడం.. తెలంగాణలో కాంగ్రెస్‌-బీజేపీ బంధం బలంగా ఉండటం, కావాలనే అతన్ని తప్పించే ప్రయత్నం జరుగుతున్నట్టు జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి.

‎ఇప్పుడే అరెస్టు వద్దు.. ఎవరూ మాట్లాడొద్దు!

‎బీఆర్‌ఎస్‌ను విమర్శించే సందర్భం ఏదైనా సరే చెట్టాపట్టాలేసుకొని.. ఒక పద్ధతి ప్రకారం కలిసి వెళ్లే బండి సంజయ్‌, ముఖ్యనేతలు తమదాకా వచ్చేసరికి జాగ్రత్తలు పడుతున్నట్టు తెలుస్తోంది. కుమారుడిపై ఏకంగా పోక్సో కేసు నమోదైనా పోలీసులు అరెస్టు చేయకపోవడానికి ప్రధాన కారణం.. ముఖ్యనేత నుంచి వచ్చిన ఆదేశాలేనని పోలీసువర్గాలు అంటున్నాయి. 'ఈ కేసులో ఇప్పుడే అరెస్టులేమీ వద్దు.. కొన్నాైళ్లెతే అంతా సద్దుమణుగుతుంది.. దీనిపై మనవాళ్లు ఎవరూ మాట్లాడొద్దు' అంటూ ముఖ్యనేత తన అనుచరగణానికి ఆదేశాలు రావడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసే సాహసం చేయడం లేదని సమాచారం.

‎ఇక ముఖ్యనేత ఆదేశాల మేరకు కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు.. ముఖ్యంగా మహిళా మంత్రులు సైతం నోరు మెదపడం లేదు. అటు కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా కూడా మూగబోయింది. ఇంకొందరు కాంగ్రెస్‌ సోషల్‌ వారియర్స్‌ బండి సంజయ్‌కు మద్దతుగా పోస్టులు, కామెంట్లు పెడుతూ ముఖ్యనేత అడుగుజాడల్లో నడుస్తున్నారు. సంజయ్‌ కొడుకు వ్యవహారంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం, పోలీసులు, పెద్దలు సంపూర్ణ మద్దతిస్తున్నారు. ఇటీవల కొత్తగా పార్టీ పెట్టిన వారు కూడా ఈ అంశంపై మాట్లాడకపోవడంతో సోషల్‌ మీడియా దుమ్మెత్తి పోస్తున్నది.

‎పథకం ప్రకారం కొడుకును తప్పించి..

‎తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. బీజేపీ నేతలకు ఆ పార్టీ మద్దతు దండిగా ఉండటంతో పక్కా పథకం ప్రకారం తన కొడుకును తండ్రి బండి సంజయ్‌ తప్పించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఒక్క ఫోన్‌ నంబర్‌ ఆధారంగా విదేశాల్లోనూ రహస్య ఆపరేషన్లు చేసి అరెస్టు చేసిన పోలీసులు సైతం.. 'భగీరథ్‌ ఎక్కడున్నాడో మాకు తెల్వడం లేదు. ఆయన ఫోన్‌ స్విచ్ఛాప్‌ వస్తుంది' అని చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నది.

‎కొత్త డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్‌ సైతం.. మహిళల రక్షణే తమ ప్రథమ కర్తవ్యమని చెప్పి.. బండి కుమారుడి విషయంలో కిక్కురమనడం లేదని రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి. తన కుమారుడి ఆచూకీ దొరకకపోతే.. ఆయన ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వస్తుంటే.. తండ్రి సంజయ్‌ మాత్రం ఎలాంటి కంగారు లేకుండా ప్రధాని సభలో జోష్‌తో మాట్లాడారు. కొడుకు కనిపించడం లేదని ఫిర్యాదు ఇవ్వకపోవడంతో.. అతనే తన కొడుకును తప్పించి ఉంటాడని అనుమానాలు తలెత్తుతున్నాయి

Search
Categories
Read More
Business & Finance
Credit Score Check for Better Loan Eligibility Today
A credit score check helps you understand your financial health and borrowing eligibility before...
By Navya Sree 2026-07-23 05:58:15 0 20
Andhra Pradesh
వ్యక్తిగత పర్యటన నిమిత్తం బాపట్ల విచ్చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి స్వాగతం సుస్వాగతం
వ్యక్తిగత పర్యటన నిమిత్తం బాపట్ల విచ్చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్...
By Gadiyapudi Narendra 2025-12-28 16:14:21 0 443
Telangana
విద్యార్థుల డిజిటల్ విద్యకు స్మార్ట్ టీవీ బహూకరణ
మహబూబాబాద్,మహబూబాబాద్ మండలంలోని ఎంపీపీఎస్ హనుమంతునిగూడెం పాఠశాల విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం...
By Bheeshman King 2026-07-22 12:52:40 0 66
Telangana
టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులను అక్రిడిటేషన్ సమావేశాలకు ఆహ్వానించాలి
రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీల సమావేశాలకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్...
By Pinnehasan Odela 2026-05-06 08:49:46 0 221
Andhra Pradesh
​ప్రైవేట్ ఆసుపత్రిలో గర్భిణీ మృతి: కుటుంబీకుల ఆందోళన.
మదనపల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరిన గాయత్రి అనే గర్భిణీ మృతి చెందడంతో ఉద్రిక్తత...
By Pagadala Venkateswar 2026-03-08 04:46:00 0 142
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com