విద్యార్థుల డిజిటల్ విద్యకు స్మార్ట్ టీవీ బహూకరణ

0
51

మహబూబాబాద్,
మహబూబాబాద్ మండలంలోని ఎంపీపీఎస్ హనుమంతునిగూడెం పాఠశాల విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం కీర్తిశేషులు బండి ఎలేంద్ర, బిక్షపతి కుమారుడు బండి శ్రీనివాస్ తన తల్లిదండ్రుల స్మారకార్థం రూ.25 వేల విలువైన స్మార్ట్ టీవీని పాఠశాలకు బహూకరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలాజీ కుమార్ మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బోధన అత్యంత అవసరమని అన్నారు. పేద, వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు నాణ్యమైన డిజిటల్ విద్యను అందుకునేందుకు ఈ స్మార్ట్ టీవీ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

విద్య పట్ల సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి పాఠశాలకు స్మార్ట్ టీవీని అందించిన శ్రీ బండి శ్రీనివాస్ సేవాభావం, దాతృత్వాన్ని ఆయన కొనియాడారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కిరణ్ కుమార్, శంకర్, సాయికుమార్, శిరీష పాల్గొని దాతకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం సమాజంలోని దాతలు ఇలాంటి సేవా కార్యక్రమాలకు మరింతగా ముందుకు రావాలని ఆకాంక్షించారు.

Search
Categories
Read More
Telangana
తెలంగాణను అభివృద్ధి చేయడమే బీజేపీ నినాదం.
ఈనెల 10న పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి బహిరంగ సభ నేపథ్యంలో...
By Ponnala Srinivasrao 2026-05-09 04:43:54 0 135
Meghalaya
Border Tensions: Additional SF-10 Forces Deployed to Lapangap
Security has been intensified in the troubled border village of Lapangap today. Following reports...
By Dunna Jessicaruth 2026-05-15 10:40:18 0 95
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా నీటి నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, ఏప్రిల్ 08, 2026*  ...
By Rajini Kumari 2026-04-08 16:23:05 0 172
Telangana
విద్యార్థుల డిజిటల్ విద్యకు స్మార్ట్ టీవీ బహూకరణ
మహబూబాబాద్,మహబూబాబాద్ మండలంలోని ఎంపీపీఎస్ హనుమంతునిగూడెం పాఠశాల విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం...
By Bheeshman King 2026-07-22 12:52:40 0 52
Bharat Aawaz
Panchayat Elections in Telangana: It's Not Just a Vote – It's a Voice for Your Village
In every election, we talk about leaders in Delhi or Hyderabad. But real change — the kind...
By Bharat Aawaz 2025-06-25 10:14:58 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com