అమరావతిలో పుంగోల్ తరహా టౌన్‌షిప్.. దేశానికే ఆదర్శం: మంత్రి లోకేశ్‌.

0
99

అమరావతిలో పుంగోల్ తరహా టౌన్‌షిప్.. దేశానికే ఆదర్శం: మంత్రి లోకేశ్‌

11-05-2026 Mon 10:57 | Andhra

Nara Lokesh Announces Punggol Like Township in Amaravati

సింగపూర్ పర్యటనలో మంత్రి లోకేశ్‌

అమరావతిలో సింగపూర్ పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మాణం చేప‌డ‌తామ‌ని వెల్ల‌డి

దేశానికే ఆదర్శంగా ఉండేలా టౌన్‌షిప్‌ను తీర్చిదిద్దుతామన్న మంత్రి లోకేశ్‌

గ్లోబల్ మైస్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దేందుకు సింగపూర్ సహకారం

అమరావతికి చట్టబద్ధతతో పెట్టుబడిదారుల్లో పెరిగిన విశ్వాసం

ఏపీ రాజధాని అమరావతిలో సింగపూర్‌లోని ప్రఖ్యాత పుంగోల్ జిల్లా తరహాలో ఒక భారీ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను నిర్మించనున్నట్లు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. ఈ టౌన్‌షిప్ కేవలం రాష్ట్రానికే కాకుండా యావత్ భారతదేశానికే ఒక మోడల్‌గా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన, అక్కడి వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖతో జరిగిన జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ (జేఐఎస్‌సీ) సమావేశంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

 

ఈ సమావేశంలో మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ.. సింగపూర్ మద్దతుతో అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని అత్యుత్తమంగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే అమరావతి ఎకనమిక్ రీజియన్ అభివృద్ధిలో ఆసక్తిగల భాగస్వాములను ఆహ్వానిస్తూ ఆర్‌ఎఫ్‌పీ (ప్రతిపాదనల కోసం అభ్యర్థన) జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రాజధాని అమరావతికి ఇప్పుడు పూర్తిస్థాయి చట్టబద్ధత ఉందని, ఇది పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ టౌన్‌షిప్ నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి అవసరమైన మద్దతు తీసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Search
Categories
Read More
Telangana
అద్దెకు తీసుకున్న కార్లను అమ్మేశాడు : తూర్పు మండల డీసీపీ బాలస్వామి
సికింద్రాబాద్: యజమానిని మోసం చేసి అద్దెకు తీసుకున్న కార్లను విక్రయించి సొమ్ము చేసుకున్న వ్యక్తితో...
By Sidhu Maroju 2025-10-16 10:03:10 0 284
Andhra Pradesh
శీర్షిక: అక్షర రూపంలో గణతంత్ర శుభాకాంక్షలు! 📚🇮🇳
శీర్షిక: అక్షర రూపంలో గణతంత్ర శుభాకాంక్షలు! 📚🇮🇳 ఈ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, మా సేవామందిర్...
By Venugopal Gopal 2026-01-26 07:47:21 0 3K
Health & Fitness
మైలారం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం
శాయంపేట మండలంలోని మైలారం గ్రామ పంచాయతీ ఆవరణలో ఆరోగ్య సంరక్షణ ప్రతినిధి అరికిల్ల సుమన్(CRA)...
By Sriramula Anil 2026-07-10 08:40:30 0 101
Andhra Pradesh
పగిలిన హంద్రీనీవా పైపులైను పరిశీలించిన ఎమ్మెల్యే కోట్ల
కర్నూలు : నంద్యాల : డోన్  డోన్ మండలంలోని ఓబుళాపురం గ్రామ సమీపంలో హంద్రీనీవా పైప్‌లైన్...
By Hari Krishna 2026-01-10 13:57:46 0 237
Andhra Pradesh
గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు ప్రజా వేదిక పరిష్కారం ప్రధాన ఉద్దేశం కార్యక్రమం చేపట్టినారు.
గుంటూరు జిల్లా పోలీస్...* *తేదీ: 29.12.2025* _*//“ప్రజలకు సత్వర న్యాయం అందే విధంగా...
By KOTESWARARAO KVSR 2025-12-29 14:22:59 0 259
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com