అమరావతిలో పుంగోల్ తరహా టౌన్‌షిప్.. దేశానికే ఆదర్శం: మంత్రి లోకేశ్‌.

0
100

అమరావతిలో పుంగోల్ తరహా టౌన్‌షిప్.. దేశానికే ఆదర్శం: మంత్రి లోకేశ్‌

11-05-2026 Mon 10:57 | Andhra

Nara Lokesh Announces Punggol Like Township in Amaravati

సింగపూర్ పర్యటనలో మంత్రి లోకేశ్‌

అమరావతిలో సింగపూర్ పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మాణం చేప‌డ‌తామ‌ని వెల్ల‌డి

దేశానికే ఆదర్శంగా ఉండేలా టౌన్‌షిప్‌ను తీర్చిదిద్దుతామన్న మంత్రి లోకేశ్‌

గ్లోబల్ మైస్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దేందుకు సింగపూర్ సహకారం

అమరావతికి చట్టబద్ధతతో పెట్టుబడిదారుల్లో పెరిగిన విశ్వాసం

ఏపీ రాజధాని అమరావతిలో సింగపూర్‌లోని ప్రఖ్యాత పుంగోల్ జిల్లా తరహాలో ఒక భారీ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను నిర్మించనున్నట్లు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. ఈ టౌన్‌షిప్ కేవలం రాష్ట్రానికే కాకుండా యావత్ భారతదేశానికే ఒక మోడల్‌గా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన, అక్కడి వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖతో జరిగిన జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ (జేఐఎస్‌సీ) సమావేశంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

 

ఈ సమావేశంలో మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ.. సింగపూర్ మద్దతుతో అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని అత్యుత్తమంగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే అమరావతి ఎకనమిక్ రీజియన్ అభివృద్ధిలో ఆసక్తిగల భాగస్వాములను ఆహ్వానిస్తూ ఆర్‌ఎఫ్‌పీ (ప్రతిపాదనల కోసం అభ్యర్థన) జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రాజధాని అమరావతికి ఇప్పుడు పూర్తిస్థాయి చట్టబద్ధత ఉందని, ఇది పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ టౌన్‌షిప్ నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి అవసరమైన మద్దతు తీసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Search
Categories
Read More
Telangana
గణేష్ ఉత్సవాలు ఐక్యతకు ప్రత్యేకంగా నిలుస్తాయి : బిఆర్ఎస్ నాయకులు శంబీపూర్ కృష్ణ.
     మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:   వినాయక చవితి ఉత్సవాల భాగంగా ...
By Sidhu Maroju 2025-09-09 17:12:50 0 342
Andhra Pradesh
సోమల లో హిందూ సమ్మేళనం
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో ఆదివారం నిర్వహించిన హిందూ సమ్మేళనంలో వక్తలు హైందవ ధర్మాన్ని...
By Kothuru Murali 2026-01-04 11:04:19 0 196
Telangana
ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు
కొత్త ఆరోగ్య, ప్రమాద బీమా పథకాలకు కేబినెట్ ఆమోదం   60 ఏళ్లలోపు ఉద్యోగి సహజ మరణానికి రూ.10...
By Pinnehasan Odela 2026-02-24 15:54:56 0 215
Andhra Pradesh
పుంగనూరులో విషాద ఘటన: నలుగురు కార్బన్ మోనాక్సైడ్ తో మృతి
చిత్తూరు జిల్లా పుంగనూరులోని త్యాగరాజు వీధిలో రాత్రి నిద్రిస్తున్న నలుగురు వ్యక్తులు కార్బన్...
By Kothuru Murali 2026-03-25 09:32:06 0 154
Telangana
సమ్మక్క, సారలమ్మ జాతరలో తొలి ఘట్టం మొదలైం
జాతరకు 15 రోజుల ముందు నిర్వహించే అత్యంత సంప్రదాయబద్ధమైన 'గుడిమెలిగే' (గుడి శుద్ధి) పండుగను ఈరోజు...
By Pinnehasan Odela 2026-01-14 18:15:27 0 202
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com