కోర్టు కేసులపై నిరంతర సమీక్ష అవసరం

0
121

విజయవాడ నగరపాలక సంస్థ 

08-05-2026

 

 

*కోర్టు కేసులపై నిరంతర సమీక్ష అవసరం*

 

 

 *విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర*

 

 

 

 విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్లో శాఖాధిపతులతో వివిధ కోర్టు కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరపాలక సంస్థకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుల స్థితిగతులు, వాటిపై తీసుకోవాల్సిన చర్యలు, కోర్టు ఆదేశాల అమలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.

 

 

 

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ప్రతి కోర్టు కేసును సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, కేసుల పురోగతిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కోర్టు ఆదేశాలను సమయానికి అమలు చేయడం ప్రతి అధికారి బాధ్యత అని పేర్కొన్నారు. కోర్టు కేసుల విషయంలో నిర్లక్ష్యం వహించకుండా, శాఖల మధ్య సమన్వయంతో వేగవంతమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా, వివిధ శాఖలకు సంబంధించిన న్యాయపరమైన అంశాల్లో అవసరమైన పత్రాలు, నివేదికలు మరియు సమాచారాన్ని సిద్ధం చేసి న్యాయవాదులకు అందజేయాలని సూచించారు. కోర్టు కేసుల పరిష్కారంలో ఆలస్యం జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

 

 

ఈ సమీక్ష సమావేశంలో అదనపు కమిషనర్లు డాక్టర్ డి. చంద్రశేఖర్, ఎ. రవీంద్రరావు, చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్నకుమార్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, చీఫ్ ఇంజనీర్ ఇంచార్జ్ పి. సత్యకుమారి, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యూసీడీ) ఎం. విజయలక్ష్మి, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి. సృజన, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ డి.హరీష్, తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

Search
Categories
Read More
Haryana
Tragic Death of 4-Year-Old in Ambala Borewell Accident
In a heartbreaking turn of events, four-year-old Nirvair Singh tragically lost his life after...
By Lokeshwari Panthadi 2026-07-01 09:07:37 0 62
Andhra Pradesh
వడ్డమానూరులో రైతులు ప్రజలు కోరినట్టు గ్రామసభ నిర్వహించాలి
*వడ్డమాను లోరైతులు, ప్రజలు కోరుతున్న విధంగా గ్రామసభ నిర్వహించాలి*   *వడ్డమాను రైతులు,...
By Rajini Kumari 2026-02-06 09:37:03 0 164
Andhra Pradesh
చీరాల మండలం కొత్తపాలెం గ్రామపంచాయతీ పరిధిలో ఆటో ఢీకొని 18 నెలల పాప మృతి
చీరాల: చీరాల మండలం కొత్తపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని దళిత నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది....
By Gadiyapudi Narendra 2026-02-20 05:04:17 0 183
Andhra Pradesh
ఈరోజు మార్కాపురంలో నిర్వహించిన కూటమి ప్రభుత్వం రెండేళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి విజయోత్సవ సభ
ఈరోజు మార్కాపురంలో నిర్వహించిన కూటమి ప్రభుత్వం రెండేళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి...
By Chennaiah Kati 2026-06-18 05:39:50 0 91
Andhra Pradesh
మదనపల్లి: రోడ్డు భద్రతా నియమాలు పాటిద్దాం: ఆర్టీఓ.
మదనపల్లిలో రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా, ఆర్టీఓ అశోక్ ప్రతాప్‌రావ్ స్థానిక...
By Pagadala Venkateswar 2026-01-23 11:24:40 0 161
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com