ప్రజలకు వ్యాపారాలకు ఇబ్బంది లేకుండా చూస్తాం గద్దె రామ్మోహన్ గారు

0
115

*ప్రజలకు, వ్యాపారులకు ఇబ్బంది లేకుండా చూస్తాం*

*14వ డివిజన్‌లో చేపల వంతెన దగ్గర పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌*

*+++*

 

తూర్పు నియోజకవర్గ పరిధిలోని చేపల వంతెన దగ్గర ఉన్న చిరు వ్యాపారులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. 

 

శుక్రవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్‌లోని చేపల వంతెన దగ్గర తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్, జనసేన పార్టీ నాయకుడు అమ్మిశెట్టి వాసుతో కలిసి పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా అక్కడి వారిని అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాల్సిందిగా ఆయా విభాగాల అధికారులను ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ ఆదేశించారు.  

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ స్థానికంగా ఉన్న రోడ్డుపై లారీలు, బస్సులు రాకపోకలు సాగించడానికి చాలా ఇబ్బందిగా ఉన్న విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా స్థానికులకు ఉపయోగపడే విధంగా చేయాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలంలో చిరు వ్యాపారులు అక్కడ వ్యాపారాలు నిర్వహించుకునేలా చేసేందుకు ఉన్న మార్గాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలో ఎమ్మార్వో కార్యాలయం నిర్మాణానికి స్థలం లేకపోవడం చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అదే విధంగా అంగన్‌వాడీ స్కూల్స్‌ నిర్మాణం చేయడానికి స్థలం లేకపోవడం వల్ల వారు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ స్థలాల్లో ముందుగా అంగన్‌వాడీ స్కూల్స్‌ నిర్మాణం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఇటీవల జరిగిన సమావేశంలో స్పష్టం చేశారన్నారు. ప్రభుత్వ స్థలాలను ప్రజలకు ఇబ్బంది లేకుండా చిరు వ్యాపారులకు ఉపాధి కల్పించేలా చేయడానికి ఉన్న మార్గాలను అన్వేషించి వారికి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు.  

 

*జనసేన పార్టీ నాయకుడు అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ* రోడ్లపై వ్యాపారాలు నిర్వహించే వారు తమకు ప్రభుత్వ స్థలంలో దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ను కోరారన్నారు. ఇక్కడ ఉన్న స్థలాన్ని వారికి కేటాయించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తానని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ హామీ ఇచ్చారన్నారు.

 

ఈ కార్యక్రమంలో చెన్నుపాటి గాంధీ, కాంతిశ్రీ, ముమ్మనేని ప్రసాద్, కర్ణ రమేష్, గరికపాటి బద్రి, అన్నాబత్తుల బాబి, రత్నం రమేష్, యడ్లపల్లి నాగరాజు, వాటాల హరిప్రసాద్, రాధాకృష్ణ, ఫాతిమా, కెల్ల రమేష్‌ నాయుడు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: బంగారు దుకాణాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలి: సీఐ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ స్టేషన్లో బుధవారం బంగారు నగల దుకాణాల నిర్వాహకులతో సీఐ...
By Kothuru Murali 2026-05-13 18:53:39 0 97
Andhra Pradesh
నిమ్మనపల్లె వద్ద ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు.
నిమ్మనపల్లె సమీపంలో బుధవారం ఆటో బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు గాయపడ్డారు....
By Pagadala Venkateswar 2026-05-21 05:40:12 0 87
Mizoram
Mizoram Expands Governance and Digital Public Services
Mizoram continues to strengthen governance through the expansion of digital public services,...
By Fathima Safa 2026-07-01 11:04:47 0 42
Arunachal Pradesh
Arunachal Boosts Employment and Entrepreneurship Growth
Arunachal Pradesh continues to promote employment and entrepreneurship by supporting startups,...
By Fathima Safa 2026-07-03 14:24:22 0 84
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డ సంఘటన మంగళవారం రాత్రి చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల...
By Kothuru Murali 2026-02-04 03:41:10 0 161
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com