దొంగతనల నివారణకు ప్రత్యేక దృష్టి : ఏసీపీ కిరణ్ కుమార్

0
135

మంచిర్యాల జిల్లా : బంగారు ఆభరణాల వ్యాపారులు,గోల్డ్ లోన్ సంస్థల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి.అనుమానాస్పద కదలికలతో ఉన్న వ్యక్తులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్ తెలిపారు.శుక్రవారం మందమర్రిలోని ఇల్లందు క్లబ్‌లో బెల్లంపల్లి సబ్‌డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో బ్యాంకులు,ప్రైవేట్ గోల్డ్ ఫైనాన్స్ సంస్థలు, గోల్డ్ షాపులు,లాడ్జిల మేనేజర్లు, యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏసీపీ మాట్లాడుతూ,నేరాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు అత్యంత అవసరమని పేర్కొన్నారు.ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులకు లాడ్జిల్లో గదులు కేటాయించే సమయంలో,వారి ఆధార్ కార్డుతో అనుసంధానమైన ఫోన్ నంబర్లను పరిశీలించిన అనంతరమే గదులు ఇవ్వాలని సూచించారు.ముఖ్యంగా ఇటీవల వరుస దొంగతనాలు జరుగుతున్నాయని, దొంగలు బంగారాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు.బ్యాంకులు, ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థలు,ఆభరణాల వ్యాపారులు తమ భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూడాలని అన్నారు. ఫైర్ సైరన్‌లను కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గన్ లైసెన్స్ కలిగిన వ్యక్తులను భద్రతా సిబ్బందిగా నియమిస్తే పూర్తి స్థాయి భద్రత కల్పించవచ్చని తెలిపారు.ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.నేర సంఘటనలు జరిగిన తర్వాత ఫిర్యాదు చేయడం కంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ప్రాంతాన్ని నేరరహితంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో బెల్లంపల్లి రూరల్ సీఐ హనుక్,బెల్లంపల్లి వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, మందమర్రి సీఐ పర్స రమేష్,బెల్లంపల్లి ఎస్‌ఐలు,బ్యాంకు మేనేజర్లు,గోల్డ్ షాప్ యజమానులు,లాడ్జ్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బొబ్బిలి నియోజకవర్గ పరిశీలకులు రోంగళి జగన్నాథరావు జిల్లా పార్టీ అధ్యక్షులు చిన్న శ్రీనుని మర్యాదపూర్వక కలయక.
విజయనగరం 24 మార్చి 2026: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రోంగళి జగన్నాథరావు బొబ్బిలి...
By Yalakala Vasunaidu 2026-03-24 08:50:34 0 227
Telangana
సివిల్ వివాదాల్లో పోలీసులు తలదూర్చవద్దు: డిజిపి
హైదరాబాద్:  న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిన పోలీసులే అవినీతికి పాల్పడితే ప్రజల్లో నమ్మకం...
By Sidhu Maroju 2025-10-14 07:16:20 0 229
Telangana
ఆల్వాల్ SHO ప్రశాంత్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి.
ఆల్వాల్ పోలీస్ స్టేషన్ లో నూతన భాద్యతలు స్వీకరించిన SHO ప్రశాంత్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన...
By Sidhu Maroju 2025-07-11 18:05:18 0 2K
Telangana
New governor of Telangana
తెలంగాణకు నూతన గవర్నర్ గా నియమితులైన శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారు రాష్ట్రానికి విచ్చేసిన...
By G k Nookala 2026-03-10 09:24:02 0 314
Andhra Pradesh
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకూడదు : కర్నూలు ఎస్పీ
కర్నూలు : బహిరంగప్రదేశాల్లో మద్యం సేవించి  ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే  చర్యలు ...జిల్లా...
By Hari Krishna 2025-12-26 16:14:49 0 190
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com