రూ 10 లక్షల వ్యయంతో మంచినీటి పైప్ లైన్ పనులు ప్రారంభం

0
275

 

 

ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని  ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు.నందిగామ పట్టణం కాకాని నగర్‌లో శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య కూటమి నాయకులతో కలిసి 15వ ఫైనాన్స్ నిధుల ద్వారా మంజూరైన రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న మంచినీటి పైప్‌లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ పట్టణ ప్రజలకు ఎటువంటి తాగునీటి ఇబ్బందులు లేకుండా స్వచ్ఛమైన మంచినీటిని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కాకాని నగర్ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను దృష్టిలో ఉంచుకొని ఈ పైప్‌లైన్ పనులను చేపట్టడం జరిగిందన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్న ఆమె, ప్రతి వార్డులో సమస్యలను గుర్తించి దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్, వివిధ రాష్ట్ర కార్పోరేషన్ల డైరెక్టర్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్లు, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు ప్రాంతీయ ప్రజలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్ :
ప్రపంచ ఫార్మా హబ్‌గా తెలంగాణ   ఔషధ తయారీ, వ్యాక్సిన్ ఉత్పత్తిలో దేశానికే ఆదర్శం...
By Sadaq Sadaq 2026-04-26 03:24:32 0 119
Andhra Pradesh
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.. 9 మందికి రూ.4.95 లక్షల ఆర్థిక సాయం అందజేసిన డా. గొట్టిపాటి లక్ష్మీ
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.. 9 మందికి రూ.4.95 లక్షల ఆర్థిక సాయం అందజేసిన డా. గొట్టిపాటి...
By Chennaiah Kati 2026-07-02 03:30:28 0 43
Andhra Pradesh
రేపు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఏర్పాట్లు పరిశీలన
రేపు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన - ఏర్పాట్ల పరిశీలన వెలుగొండ...
By Chennaiah Kati 2026-06-26 16:47:42 0 71
Andhra Pradesh
ప్రజల సమస్యలకే ప్రాధాన్యం ఉదయాన్నే ప్రజాదర్బార్లో అందుబాటులోకి వచ్చిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
రాయచోటి పట్టణంలోని ఎస్ఎన్ కాలనీలో ఉన్న మంత్రి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా...
By Benguluri Madhubabu 2026-06-14 03:54:02 0 136
Business & Finance
Heavy Rain Alert May Boost Jharkhand's Farm Economy
The India Meteorological Department (IMD) has issued an orange alert for heavy rainfall and...
By Navya Sree 2026-07-01 07:00:50 0 105
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com