మళ్లీ అవే సమాధానాలు.

0
108

 

మళ్లీ అవే సమాధానాలు

వైసీపీ సోషల్‌ మీడియా మాజీ కన్వీనర్‌ సజ్జల భార్గవ్‌రెడ్డిని అన్నమయ్య జిల్లా మదనపల్లె పోలీసులు రెండోసారి విచారించారు. డీఎస్పీ పావని ఆధ్వర్యంలో బి.కొత్తకోట, ములకలచెరువు సీఐలు గోపాల్‌రెడ్డి, దస్తగిరి గురువారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6:45 గంటల వరకూ స్థానిక డీఎస్పీ కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించారు. దాదాపు 140 ప్రశ్నలు అడగగా.. అన్నింటికీ తెలీదు, గుర్తులేదు అని మళ్లీ పాత సమాధానాలు చెప్పినట్టు తెలిసింది. సీఎం సతీమణి భువనేశ్వరి, హోం మంత్రి అనితలపై పెట్టిన అసభ్యకర పోస్టులకు సంబంధించి భార్గవ్‌రెడ్డిపై 2024లో బి.కొత్తకోటలో కేసు నమోదైంది. దీనిపై ఏప్రిల్‌ 26న విచారణకు హాజరైన భార్గవ్‌రెడ్డిని, అదే రోజు మదనపల్లెకు తీసుకొచ్చి విచారణ చేపట్టారు. 2022 నుంచి ఇప్పటి వరకూ ఎన్ని ఫోన్లు మార్చారు? ఎన్ని సిమ్‌లు ఉపయోగించారు? ఎన్ని సోషల్‌ మీడియా ఖాతాలు ఉపయోగించారు? అవి ఎవరివి? మీవేనా? లేక నకిలీ ఖాతాలా? జగతి పబ్లికేషన్‌కు, మీకూ ఏంటి సంబంధం? తదితర ప్రశ్నలు సంధించారు. వీటికి ఆయన తెలీదు.. ఏమో గుర్తు లేదు.. అనే సమాధానాలు చెప్పినట్లు తెలిసింది

Search
Categories
Read More
Andhra Pradesh
ఆంధ్రా అంగన్వాడీలో విద్యా విప్లవానికి శ్రీకారం
*పత్రికా ప్రకటన*  *విజయవాడ, తేదీ: 15.05.2026*    *• అచ్చ ప్రాజెక్టుతో...
By Rajini Kumari 2026-05-16 15:05:39 0 113
Andhra Pradesh
టిడిపి జెండా ఆవిష్కరణ
చీరాల మండలం గవిని వారి పాలెం లో 44 వసంతాల పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవ దినోత్సవం...
By Vadlamudi NagaVenkat 2026-03-29 09:22:16 0 458
Business & Finance
Tech Hiring Gains Momentum in Bengaluru IT Sector
Information technology companies in Bengaluru have stepped up hiring for roles in artificial...
By Navya Sree 2026-07-06 06:51:34 0 55
Andhra Pradesh
నిమ్మనపల్లెలో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి.
నిమ్మనపల్లి మండలంలో బుధవారం చేపల వేటకు వెళ్లిన వెంకటరమణ (45) అనే వ్యక్తి ప్రమాదవశాత్తూ చెరువులో...
By Pagadala Venkateswar 2026-05-20 13:50:44 0 78
Telangana
రైలు ఢీకొని ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు దాటుతున్న...
By Sidhu Maroju 2025-09-20 10:53:29 0 302
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com