చనిపోయిన రైతుల కుటుంబలకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలి : సీపీఎం రాష్ట్ర నాయకులు

0
241

 మంచిర్యాల జిల్లా : లక్షేటీపేట్ మండలం గంపలపల్లి గ్రామంలో చనిపోయిన తనువుల నాగరాజు మరియు అభిలాష్ (తండ్రి కొడుకులు ), కొత్తూరు గ్రామంలో గుండారపు వెంకటేష్( 23) రైతు కుటుంబాలను సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, మంచిర్యాల జిల్లా కమిటీ పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా బండారు రవికుమార్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, పైళ్ల ఆశయ్య సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరై మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నాలుగు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వరి ధాన్యం కోసి 25 రోజులు గడిచిన ఇంకా కల్లాలకే పరిమితమైన వరి ధాన్యం అకాల వర్షం, గాలి దుమారాం నుంచి కాపాడుకునే క్రమంలో అక్కడ గోడ ప్రక్కన నిలవడం వల్ల గాలి దుమారానికి ఆ గోడ కూలి ముగ్గురు రైతులు, ఒక కౌలు రైతు చనిపోయారు. చనిపోయిన రైతు కుటుంబాల బాధ వర్ణనాతీతం. ప్రభుత్వం సరైన సమయంలో వరి కొను గోలు చేస్తే ఇలా జరిగి ఉండేది కాదు. చనిపోయిన రైతు కుటుంబాలను ఇప్పటివరకు అధికారులు కానీ, నాయకులు పరామర్శించలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా వరి కొనుగోళ్లు వేగవంతం చేసి కోతలు లేకుండా చూడాలి. చనిపోయిన రైతు కుటుంబాలకు ఒక కోటి రూపాయలు చెల్లించాలని సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో సంకె రవి సిపిఎం జిల్లా కార్యదర్శి, కనికర అశోక్, ప్రకాష్, బోడెంకి చందు సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు, ఉమా రాణి, దూలం శ్రీనివాస్, రాజారామ్, , శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Puducherry
Blue Tech: Puducherry’s First Floating Solar Farm
Puducherry takes a massive leap toward green energy with the inauguration of its first...
By Dunna Jessicaruth 2026-05-14 10:59:19 0 139
Andhra Pradesh
ఆక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులను అందరికీ ఇంటి స్థలాలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేయించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా యువజన...
By Benguluri Madhubabu 2026-03-16 10:55:46 0 222
Andhra Pradesh
మహిళల చట్టాలపై విద్యార్థులకు అవగాహన - బి. హేన సుజన్.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ 20 రోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా నెల్లూరు ఆంధ్రప్రదేశ్ గిరిజన...
By Ratna Sekhar 2026-03-11 07:07:27 0 377
Andhra Pradesh
పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ::
కర్నూలు : పాణ్యం:  కర్నూలు టౌన్ లో కల్లూరు అర్బన్ 31 వ వార్డు బద్రీనాథ్ నగర్ లో ఎన్టీఆర్...
By Hari Krishna 2025-12-31 11:19:35 0 212
Andhra Pradesh
ఐకమత్యంతో బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి: డీఎస్పీ.
మదనపల్లిలో బక్రీద్ పండుగ సందర్భంగా డీఎస్పీ పావని ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం జరిగింది. ఈ...
By Pagadala Venkateswar 2026-05-26 05:43:59 0 93
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com