శస్త్రచికిత్స తర్వాత తొలిసారి బయటకొచ్చిన పవన్ కల్యాణ్.

0
92

దివంగత మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావుకు నివాళి

హైదరాబాద్‌లో నాదెండ్ల చిత్రపటానికి పుష్పాంజలి

మంత్రి నాదెండ్ల మనోహర్, కుటుంబ సభ్యులకు పరామర్శ

గత నెలలో అనారోగ్యం కారణంగా రాలేకపోయిన పవన్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, శస్త్రచికిత్స అనంతరం పూర్తిస్థాయిలో కోలుకున్నాక తొలిసారిగా మంగళవారం బయటకు వచ్చారు. ఇటీవల దివంగతులైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావుకు ఆయన నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని నాదెండ్ల నివాసానికి వెళ్లిన పవన్, భాస్కరరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

 

గత నెల 22న నాదెండ్ల భాస్కరరావు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పవన్ కల్యాణ్ సైనస్ సమస్యకు శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో ఆయన అంత్యక్రియలకు హాజరుకాలేకపోయారు. అయితే, వార్త తెలిసిన వెంటనే భాస్కరరావు కుమారుడు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌కు ఫోన్‌లో పరామర్శించారు.

 

తాజాగా ఆరోగ్యం కుదుటపడటంతో వైద్యుల సూచన మేరకు మంగళవారం ఆయన నేరుగా సహచర మంత్రి నాదెండ్ల మనోహర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు. చాలా రోజుల తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ సాధారణ స్థితిలో కనిపించడంతో జనసేన కార్యకర్తలు, ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సోమల మండలంలో గాలి వాన బీభత్సం
అన్నమయ్య జిల్లా, సోమల మండలంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం...
By Kothuru Murali 2026-06-09 13:53:56 0 77
Goa
Goa Congress Opposes Ports Terminal Inauguration
The Goa Congress has opposed the scheduled inauguration of the new Captain of Ports terminal,...
By Navya Sree 2026-06-25 08:40:30 0 127
Andhra Pradesh
Malla Ramgopal Naidu: కీర్తిచక్ర మేజర్‌కు ఏపీ ప్రభుత్వం భారీ నజరానా.. రూ.1.25 కోట్ల నగదు బహుమతి.
కీర్తిచక్ర మేజర్ రామ్‌గోపాల్ నాయుడికి నగదు పురస్కారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన...
By Pagadala Venkateswar 2026-01-28 06:19:02 0 141
SURAKSHA
TN Police Tracking Missing Persons Rapidly
 The Tamil Nadu Police are demonstrating excellent performance in locating missing persons....
By Kalaga Sailaja 2026-06-27 11:01:08 0 107
Telangana
రామగుండం, గోదావరిఖని గనులలో పర్యటించిన సింగరేణి సి & ఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతి
సింగరేణి సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డా. బుద్దప్రకాష్ జ్యోతి, ఐఏఎస్ శుక్రవారం...
By Avunoori Mahesh 2026-05-29 11:03:07 0 144
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com