"బక్రీద్‌కు శాంతి బాట… అల్వాల్‌ పిఎస్ ల్లో శాంతి కమిటీ సమావేశం.|

0
271

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : రాబోయే బక్రీద్ పండుగను శాంతియుతంగా నిర్వహించేందుకు అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశాన్ని ఎస్హెచ్ఓ ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 

ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ డీసీ భోగేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై, మత పెద్దలు, స్థానిక నాయకులు, ప్రాంతీయ ప్రజలతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ డీసీ భోగేశ్వర్లు మాట్లాడుతూ, పండుగలను సామరస్య వాతావరణంలో జరుపుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. 

బక్రీద్ సందర్భంగా ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ, పరిశుభ్రత, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలు, అధికారులు పరస్పర సహకారంతో ముందుకు వెళితే ఎలాంటి సమస్యలు తలెత్తవని అన్నారు.

సమావేశంలో పండుగను ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు.

మత సామరస్యాన్ని కాపాడుతూ పండుగను జరుపుకోవాలని, జంతు బలి నిర్వహణలో నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు. ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్, శబ్ద కాలుష్య నియంత్రణ వంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

అనంతరం, ఎస్హెచ్ఓ ప్రశాంత్ మాట్లాడుతూ, ప్రజల సహకారం ఉంటేనే పండుగలు శాంతియుతంగా జరుగుతాయని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వీరబాబు, ఎస్సైలు, తరుణ్ రెడ్డి,  రాఘవేందర్ రెడ్డి, దేవేందర్, మల్లేష్, గీత, ఏఎస్ఐ తులసిరామ్, సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో పాల్గొన్న మత పెద్దలు, ప్రజాప్రతినిధులు పండుగను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాలు పరామర్శించిన వైఎస్ఆర్సిపి నేతలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాల్ని పరామర్శించిన వైఎస్ఆర్ సిపి నేతలు...
By Rajini Kumari 2026-06-09 12:38:13 0 223
Uttar Pradesh
Uttar Pradesh 2026: Education Reforms and Digital Learning
Uttar Pradesh's education sector in 2026 continues to evolve through comprehensive reforms and...
By Fathima Safa 2026-06-16 11:34:46 0 62
SURAKSHA
TN Police Today: Serving Beyond Duty With Humanity
Today Tamil Nadu police officers proved service goes beyond duty hours. In Chennai, Coimbatore,...
By Kalaga Sailaja 2026-07-04 07:34:33 0 44
Telangana
1 sq.yd of land in KPHB has reached up to 2.65 lakhs
The Lands and Plots in KPHB has been sold out in higher rates. The flat of 1400 sft has costed...
By Terli Ashok 2026-02-27 14:22:33 0 417
Gujarat
Gujarat Weather Update: Monsoon Brings Relief to State
The latest meteorological reports from June 26, 2026, paint a promising picture for Gujarat as...
By Lokeshwari Panthadi 2026-06-27 08:32:54 0 96
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com