కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి లొసుగులను ఆసరాగా చేసుకుని హైదరాబాద్‌లో భారీ రియల్ ఎస్టేట్ మోసం

0
151

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి లొసుగులను ఆసరాగా చేసుకుని హైదరాబాద్‌లో భారీ రియల్ ఎస్టేట్ మోసం వెలుగు చూసింది. నకిలీ భూమి రిజిస్ట్రేషన్ పేరుతో ఓ వ్యాపారవేత్త నుంచి కేటుగాళ్లు రూ.2.15 కోట్లు దోచుకోవడం సంచలనం రేపింది.

‎హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తకు రాయదుర్గంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రెండు ఫ్లాట్లు ఉన్నాయి. వాటిలో ఒక దాంట్లో ఫ్యామిలీతో ఉంటున్నాడు. మరో ఫ్లాట్‌ను దివాకర్ బాబు పర్వతనేని అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చాడు. అయితే సదరు వ్యాపారవేత్తతో దివాకర్ పరిచయం పెంచుకున్నాడు. అనంతరం ముత్తంగి సమీపంలో తనకు రూ.2.15 కోట్ల విలువైన 1.19 గుంటల భూమి ఉందని, దాన్ని తక్కువ ధరకే అమ్మాలని అనుకుంటున్నానని చెప్పాడు. దివాకర్‌కు అతని సోదరి కూడా మద్దతుగా ఉంది. వారి మాటలను నమ్మిన వ్యాపారవేత్త రెండు విడతల్లో రూ.2.15 కోట్లు బదిలీ చేశాడు. దీంతో కంది రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వ్యాపారవేత్తను తీసుకెళ్లిన దివాకర్.. భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగినట్లుగా నమ్మించాడు.

‎అలాగే నిజాంపేటలో ఉన్న వ్యాపారవేత్తకు ఉన్న విల్లాను కూడా అమ్మిపెడతానని అతని నుంచి దివాకర్ పత్రాలు తీసుకున్నాడు. అనంతరం సంతకం ఫోర్జరీ చేసి లింగారెడ్డి అనే వ్యక్తికి సేల్ అగ్రిమెంట్ చేశాడు. ఇటీవల విల్లాను స్వాధీనం చేసుకునేందుకు లింగారెడ్డి వచ్చిన క్రమంలో ఈ మోసం బయటపడింది. వెంటనే కంది రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి విచారించగా.. అసలు తన పేరిట ఎలాంటి భూమి రిజిస్ట్రేషన్ జరగలేదని తెలిసి ఆశ్చర్యపోయాడు. దీనిపై బాధితుడు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Search
Categories
Read More
Himachal Pradesh
Himachal Pradesh Boosts Sports Development in 2026
Himachal Pradesh is strengthening its sports ecosystem through improved infrastructure, athlete...
By Fathima Safa 2026-07-02 08:55:32 0 69
SURAKSHA
Flood Rescue: Goa Police Saves Lives During Monsoon
During heavy monsoon rains, Goa Police acts as first responder. Officers use boats and rafts to...
By Kalaga Sailaja 2026-07-03 05:55:41 0 35
Andhra Pradesh
పుంగనూరు:చంద్రబాబును కలిసిన చల్లా బాబు.
శనివారం నగరిలో పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం...
By Kothuru Murali 2026-01-24 12:16:03 0 173
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
శనివారం పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం లోని కందూరు నిమ్మనపల్లి మార్గంలో సమాదిగుట్టపల్లె సమీపంలో...
By Kothuru Murali 2026-04-19 11:04:56 0 172
Uncategorized
The Sonic Shift: Evaluating Historical Protest Songs
A comprehensive academic analysis finalized this spring traces the structural evolution of...
By Dunna Jessicaruth 2026-05-19 07:26:47 0 85
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com