వరంగల్‌ పట్టణంలో ఈనెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సభను జయప్రదం చేయండి,బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు

0
83

వరంగల్‌ పట్టణంలో ఈనెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సభను జయప్రదం చేసి.. కాంగ్రెస్‌ సర్కారు రైతు వ్యతిరేక విధానాలను ఎండగ ట్టాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

‎వరంగల్‌ పట్టణంలో ఈనెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సభను జయప్రదం చేసి.. కాంగ్రెస్‌ సర్కారు రైతు వ్యతిరేక విధానాలను ఎండగ ట్టాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావుతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతు సంగ్రామ సభకు సంబంధించిన ఏర్పాట్లు, జన సమీకరణ, ఇతరత్రా అంశాల పై కేసీఆర్‌ దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు నిర్లక్ష్యం, కాంగ్రెస్‌ వరంగల్‌ రైతు డిక్లరేషన్‌పై నిలదీయాలని సూచించినట్లు సమాచారం. ‘రైతుల పంటలను కొనుగోలు చేయడంలో సర్కారు విఫలమవ్వడం, యాసంగి రైతు భరోసా ఇప్పటికీ పూర్తిగా అందించకపోవడం, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకపోవడం, యూరియా యాప్‌తో రైతులు పడుతున్న ఇబ్బందులు, యాసంగి పంటలు చివరిదశలో ఉన్న నేపథ్యంలో కరెంట్‌ కోతలపై సర్కారును సభావేదిక సాక్షిగా నిలదీయాలి. అలాగే మోటార్లకు మీటర్లు పెట్టే అంశంపై ప్రభుత్వ వైఖరిని రైతు సభలో ఎండగట్టాలి’ అని నిర్ణయించినట్లు తెలిసింది.

‎ధాన్యం కొనుగోళ్ల విషయంలో సర్కారు నిర్లక్ష్యంపై కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేపట్టే అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

Search
Categories
Read More
Telangana
ఎయిర్పోర్ట్ పనులను వేగవంతం చేయాలన్న కలెక్టర్....
ఎయిర్పోర్టు పనులు వేగవంతం చేయాలి: వరంగల్ కలెక్టర్ భారత్ అవాజ్ న్యూస్: 14 మే రోజున వరంగల్...
By Gujile Ramu 2026-05-14 01:28:24 0 60
Andhra Pradesh
విన్నర్ రేంజ్‌లో రెమ్యునరేషన్.. 15 వారాలకు ఇమ్మాన్యుయేల్ ఎన్ని లక్షలు తీసుకున్నాడంటే?
  బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు ముందే ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అయ్యాడు. సీజన్...
By SivaNagendra Annapareddy 2025-12-21 11:09:49 0 192
Andhra Pradesh
మార్చి 9న 'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక' చీరాల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహణ
ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే పి.జి.ఆర్.ఎస్ కార్యక్రమాన్ని మార్చి 9న సోమవారం...
By Vadlamudi NagaVenkat 2026-03-06 14:51:55 0 563
Andhra Pradesh
కూటమి ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉంది మౌర్యా రెడ్డి
కూటమి ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉంది అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి మేనల్లుడు...
By Benguluri Madhubabu 2026-02-22 06:40:38 0 183
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com