వరంగల్‌ పట్టణంలో ఈనెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సభను జయప్రదం చేయండి,బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు

0
120

వరంగల్‌ పట్టణంలో ఈనెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సభను జయప్రదం చేసి.. కాంగ్రెస్‌ సర్కారు రైతు వ్యతిరేక విధానాలను ఎండగ ట్టాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

‎వరంగల్‌ పట్టణంలో ఈనెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సభను జయప్రదం చేసి.. కాంగ్రెస్‌ సర్కారు రైతు వ్యతిరేక విధానాలను ఎండగ ట్టాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావుతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతు సంగ్రామ సభకు సంబంధించిన ఏర్పాట్లు, జన సమీకరణ, ఇతరత్రా అంశాల పై కేసీఆర్‌ దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు నిర్లక్ష్యం, కాంగ్రెస్‌ వరంగల్‌ రైతు డిక్లరేషన్‌పై నిలదీయాలని సూచించినట్లు సమాచారం. ‘రైతుల పంటలను కొనుగోలు చేయడంలో సర్కారు విఫలమవ్వడం, యాసంగి రైతు భరోసా ఇప్పటికీ పూర్తిగా అందించకపోవడం, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకపోవడం, యూరియా యాప్‌తో రైతులు పడుతున్న ఇబ్బందులు, యాసంగి పంటలు చివరిదశలో ఉన్న నేపథ్యంలో కరెంట్‌ కోతలపై సర్కారును సభావేదిక సాక్షిగా నిలదీయాలి. అలాగే మోటార్లకు మీటర్లు పెట్టే అంశంపై ప్రభుత్వ వైఖరిని రైతు సభలో ఎండగట్టాలి’ అని నిర్ణయించినట్లు తెలిసింది.

‎ధాన్యం కొనుగోళ్ల విషయంలో సర్కారు నిర్లక్ష్యంపై కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేపట్టే అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

Search
Categories
Read More
Himachal Pradesh
Himachal Pradesh Strengthens Environmental Conservation
Himachal Pradesh has intensified its focus on environmental conservation amid rising challenges...
By Fathima Safa 2026-06-29 12:09:55 0 60
Andhra Pradesh
జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు : కర్నూల్ ఎస్పీ
కర్నూలు : కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా...(01.01.2026)- జిల్లా ప్రజలకు, మీడియాకు, పోలీసులకు నూతన...
By Hari Krishna 2026-01-01 04:55:20 0 236
Business & Finance
Kerala Tourism Sees Strong Monsoon Bookings
Kerala's tourism industry is witnessing strong monsoon bookings as domestic travelers...
By Navya Sree 2026-07-06 07:31:32 0 89
SURAKSHA
AI Cameras and Drones Make Karnataka Roads Safer Every Day
Karnataka Traffic Police uses AI CCTV and drones to reduce road accidents. Cameras auto-detect...
By Kalaga Sailaja 2026-07-01 11:07:58 0 34
Andhra Pradesh
జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ మరియు నగరపాలక సంస్థ కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలి
ప్రచురణార్థం 19 డిసెంబర్ 2025 **జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ మరియు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో...
By Rajini Kumari 2025-12-19 12:07:00 0 359
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com