కారంపూడి దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. ఆరుగురు అరెస్ట్.

0
103

నిందితుల నుంచి బంగారం, వాహనాలు స్వాధీనం

 జ్యువెలరీ షాపు ఉద్యోగే సూత్రధారి అని తేల్చిన పోలీసులు

 సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకున్న పోలీసులు

పల్నాడు జిల్లా కారంపూడిలో పట్టపగలు బంగారం వ్యాపారిపై దాడి చేసి రూ.60 లక్షల విలువైన ఆభరణాలు దోచుకెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ దోపిడీకి పాల్పడిన ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి బంగారం, నేరానికి ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను పల్నాడు ఎస్పీ బి. కృష్ణారావు మీడియాకు వెల్లడించారు.

 

వినుకొండకు చెందిన బంగారం వ్యాపారి యక్కల శ్రీనివాసరావుపై ఇటీవల జరిగిన దోపిడీ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. స్థానిక జ్యువెలరీ షాపులో పనిచేస్తున్న గోసుల శంబయ్య (27) ఈ దోపిడీకి ప్రధాన సూత్రధారి అని తేల్చారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో, చెడు అలవాట్లకు బానిసైన శంబయ్య.. వ్యాపారి శ్రీనివాసరావు కదలికలపై నిఘా పెట్టాడు. ప్రతి సోమవారం శ్రీనివాసరావు ఆభరణాలతో కారంపూడికి వస్తాడని తెలుసుకుని, తన స్నేహితులతో కలిసి దోపిడీకి పక్కా ప్రణాళిక రచించాడు.

 

ప్లాన్ ప్రకారం, బండారు అజిత్ (25), కె. శశికుమార్ (22), కె. సాయికిరణ్ (24), ఎ. నిఖిల్ మహేష్ (20), జి. పవన్ (30)లతో కలిసి శంబయ్య ఈ దోపిడీకి పాల్పడ్డాడు. వ్యాపారిపై దాడి చేసి, బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును లాక్కొని బైక్‌లపై పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, గురజాల డీఎస్పీ మహేశ్వరరావు పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

 

సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి, ఎన్ఎస్పీ కాలువ కట్ట వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 566.60 గ్రాముల బంగారు ఆభరణాలు, నేరానికి ఉపయోగించిన యమహా ఎంటీ-15, హీరో గ్లామర్ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన దర్యాప్తు బృందాన్ని ఎస్పీ కృష్ణారావు అభినందించారు

Search
Categories
Read More
Madhya Pradesh
Charak Hospital Trauma Team Battles to Save Ujjain Stabbing Victim
In a critical response to escalating urban violence, local medical professionals at Charak...
By Lokeshwari Panthadi 2026-06-27 08:20:08 0 80
Andhra Pradesh
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కురవంక పంచాయతీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ముగిసింది.
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కురవంక పంచాయతీ లో మంగళవారం నిర్వహించిన స్పెషల్...
By Pagadala Venkateswar 2026-07-14 09:18:43 0 50
Telangana
పెద్దపల్లి : ఆర్థిక నష్టాలతో యువకుడి ఆత్మహత్య...!
ఓదెల మండలం శానకొండ గ్రామానికి చెందిన కోదాటి రాకేష్ రావు 36 వ్యాపారంలో అధిక నష్టాలతో మానసిక...
By Sunka Santhosh 2026-06-16 20:16:11 0 113
Andhra Pradesh
Boyakonda: ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో రాహుకాల అభిషేకం, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ.
Boyakonda: శ్రీ బోయకొండ గంగమ్మకు వైభవంగా అభిషేకం ప్రత్యేక పూజలు   శక్తి స్వరూపిణి శ్రీ...
By Pagadala Venkateswar 2026-07-11 04:09:12 0 57
Andhra Pradesh
నూతన వధూవరులను ఆశీర్వదించిన సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు రాయచోటి పట్టణం ప్రీతం కళ్యాణ మండపం లో జరిగిన కే రామాపురం వాస్తవులు గాండ్లపెంట నాగరాజు గారి...
By Benguluri Madhubabu 2026-03-15 08:29:48 0 204
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com