జేఈఈ మెయిన్స్ టాపర్లను అభినందించిన సీఎం చంద్రబాబు.

0
90

 

జేఈఈ మెయిన్స్ టాపర్లను అభినందించిన సీఎం చంద్రబాబు

04-05-2026 Mon 07:39 | Both States

Chandrababu Naidu Congratulates JEE Mains Toppers

100 పర్సంటైల్ సాధించిన నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు

ఉండవల్లిలో ముఖ్యమంత్రిని కలిసిన టాపర్లు, సంస్థ డైరెక్టర్లు

నారాయణ విద్యాసంస్థల యాజమాన్యాన్ని కూడా ప్రశంసించిన సీఎం

జేఈఈ మెయిన్స్‌లో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ పరీక్షలో 100 పర్సంటైల్ సాధించి టాపర్లుగా నిలిచిన నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు నిన్న రాత్రి ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.

 

వివరాల్లోకి వెళ్తే, నారాయణ విద్యాసంస్థల్లో చదివి 100 పర్సంటైల్ సాధించిన మహిత్ ఆంధ్రప్రదేశ్‌లో టాపర్‌గా నిలిచారు. అలాగే తెలంగాణ నుంచి సాయి రిత్విక్‌రెడ్డి, మహేశ్వరి, భవితేష్‌రెడ్డి టాపర్లుగా నిలిచారు. ఈ విద్యార్థులతో పాటు నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు కె. పునీత్, గంటా రవితేజ, పి. సింధూర, శరణి కూడా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

 

ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో ఏటా ఉత్తమ ఫలితాలు సాధిస్తూ తెలుగు విద్యార్థుల ప్రతిభను చాటుతున్న నారాయణ విద్యాసంస్థల యాజమాన్యాన్ని, సిబ్బందిని కూడా ముఖ్యమంత్రి అభినందించారు.

Search
Categories
Read More
Bihar
RJD Scores Major Win in MLC Bypoll
Bhojpur-Buxar | The political landscape in Bihar shifted today as the opposition Rashtriya Janata...
By Dunna Jessicaruth 2026-05-15 07:26:54 0 79
Tripura
Tripura's E-Governance Drive Transforming Public Services
Tripura is accelerating its digital governance and e-governance initiatives to make public...
By Fathima Safa 2026-06-25 09:25:42 0 63
SURAKSHA
Muddada Ravi Chandra, IAS: Leading Good Governance
A Dynamic Civil Servant Advancing Transparent Administration, Inclusive Development, and...
By Lokeshwari Panthadi 2026-07-13 10:30:17 0 69
Telangana
"పెండింగ్ పనులకు వేగం పెంచండి.. ఈఈ వెంకటేష్‌ను కోరిన శాంతి శ్రీనివాస్ రెడ్డి".|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : పెండింగ్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అల్వాల్ సర్కిల్ మాజీ...
By Sidhu Maroju 2026-06-05 08:08:34 0 156
Andhra Pradesh
తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త పార్థివ దేహానికి ఘనంగా నివాళులర్పించిన సుగవాసి ప్రసాద్ బాబు
తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త మరణించిన విషయం తెలుసుకొని చిన్నమండెం మండలం వండాడి గ్రామం...
By Benguluri Madhubabu 2026-02-24 14:29:49 0 227
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com