పవనన్నా... ఇది మనందరి విజయం: డిప్యూటీ సీఎం ప్రశంసలకు లోకేష్ స్పందన.

0
91

 

పవనన్నా... ఇది మనందరి విజయం: డిప్యూటీ సీఎం ప్రశంసలకు లోకేష్ స్పందన

01-05-2026 Fri 21:57 | Andhra

Nara Lokesh Responds to Pawan Kalyans Praise on Tenth Results

ఏపీలో నిన్న పదో తరగతి ఫలితాలు విడుదల 

గతేడాది కంటే మెరుగ్గా ఫలితాలు

పదో తరగతి ఫలితాలపై లోకేష్ ను ప్రశంసించిన పవన్‌

ధన్యవాదాలు తెలిపిన లోకేష్ 

కూటమి ప్రభుత్వ సంస్కరణలతోనే మెరుగైన ఫలితాలని వెల్లడి

విద్యాశాఖను దేశానికే ఆదర్శంగా నిలుపుతామని హామీ

పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందించినందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. "పవనన్నా ఇది మనందరి విజయం" అంటూ వినమ్రంగా బదులిచ్చారు. టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాశాఖ, ప్రభుత్వం సమష్టిగా కృషి చేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. పవన్ కల్యాణ్ ప్రోత్సాహం, అందరి సహకారంతో ఏపీ విద్యాశాఖను దేశానికే రోల్ మోడల్‌గా నిలుపుతానని లోకేష్ స్పష్టం చేశారు.

 

అంతకుముందు, పదో తరగతి ఫలితాలపై పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. విద్యాశాఖలో మంత్రిగా నారా లోకేష్ అమలు చేస్తున్న ప్రణాళికలు ప్రశంసనీయమని, కూటమి ప్రభుత్వ సంస్కరణలతోనే అద్భుత ఫలితాలు వచ్చాయని అన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం సుమారు 4 శాతం పెరిగిందని పవన్ గుర్తుచేశారు.

 

ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత 72.8 శాతం నుంచి 78.39 శాతానికి పెరగడం శుభపరిణామమన్నారు. మెగా పేరెంట్ టీచర్స్ మీట్, పరీక్షలకు ముందు అమలు చేసిన 100 రోజుల ప్రణాళిక వంటివి సత్ఫలితాలనిచ్చాయని ఆయన వివరించారు. ఈ విజయం వెనుక ఉన్న ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులకు పవన్ అభినందనలు తెలియజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Ambati Rambabu: జైలులో అంబటి నిద్రకు ప్రత్యేక పరికరం.
నిద్రలో శ్వాస సంబంధిత సమస్య ఉన్న అంబటి రాంబాబు కోర్టు ఆదేశాలతో స్లీప్ అప్నియా పరికరాన్ని...
By Pagadala Venkateswar 2026-02-04 07:39:22 0 160
Andhra Pradesh
, తిరుపతి: నేడు యస్.వి.యు డిగ్రీ ఫలితాలు విడుదల
తిరుపతి యస్.వి యు.డిగ్రీ ఫలితాలు ఏప్రిల్ లో వ్రాసిన బి.ఏ, బికామ్, బియస్.సి ఫలితాలు నేడు విడుదల...
By Karapati Gopi 2025-12-29 01:17:09 0 306
Telangana
పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్.
బోరాణి కమ్యూనిటీ లో మొహర్రం యొక్క ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, సబిత అనిల్...
By Sidhu Maroju 2025-07-02 13:43:06 0 1K
Business & Finance
How to Change Your Company or Organization Name Legally
Changing the name of a company or organization involves obtaining approval from the relevant...
By Navya Sree 2026-07-20 05:00:47 0 27
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : మహా సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దిరెడ్డి
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, మంగళంపేటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి మహా...
By Kothuru Murali 2026-02-20 11:00:54 0 152
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com