దటీజ్ చంద్రబాబు".. సీఎం విందులో మంత్రుల ఆసక్తికర వ్యాఖ్యలు.

0
104

"దటీజ్ చంద్రబాబు".. సీఎం విందులో మంత్రుల ఆసక్తికర వ్యాఖ్యలు

30-04-2026 Thu 22:49 | Andhra

AP Ministers heaps praise on CM Chandrababu

బిజినెస్ రిఫార్మర్ అవార్డు వేళ ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు ఆత్మీయ విందు

పరిశ్రమల గ్రౌండింగ్ వరకు విశ్రమించవద్దని చంద్రబాబు చెబుతారన్న మంత్రి టీజీ భరత్

పట్టిసీమను విమర్శించిన వారికి రూ.50 వేల కోట్ల సంపదతో సమాధానమిచ్చారన్న నిమ్మల

విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను ఆపి రూ.11 వేల కోట్లు ఇప్పించడం చంద్రబాబు ఘనతన్న సత్యకుమార్

సీఎం పనితీరు, దార్శనికతపై పలువురు మంత్రుల ఆసక్తికర వ్యాఖ్యలు

'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025' అవార్డు అందుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులకు ఆత్మీయ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమం సీఎం చంద్రబాబు నాయకత్వ లక్షణాలు, ఆయన పనితీరు, దార్శనికతపై మంత్రులు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలకు వేదికైంది. చంద్రబాబుతో కలిసి పనిచేయడంలో తమ అనుభవాలను, ఆయన నుంచి నేర్చుకున్న పాఠాలను మంత్రులు పంచుకున్నారు.

 

ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. పెట్టుబడులు ఆకర్షించడంలో సీఎం చంద్రబాబు తమను పరుగులు పెట్టిస్తారని అన్నారు. "పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు కుదుర్చుకోవడంతో సరిపెట్టకుండా, ఆ పరిశ్రమలు వాస్తవంగా కార్యకలాపాలు ప్రారంభించే (గ్రౌండింగ్) వరకు విశ్రమించవద్దని సీఎం పదే పదే గుర్తుచేస్తుంటారు. ఈ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా ఉండేందుకు, సమన్వయం కోసం ఏకంగా 90 మంది అధికారులతో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని పనిచేస్తున్నాం" అని ఆయన వివరించారు.

 

జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు ముందుచూపును కొనియాడారు. "ఒకప్పుడు ఇంజనీరింగ్ చదువుల కోసం విద్యార్థులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లేవారు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఇంజనీరింగ్ కాలేజీలతో నింపి 'నాలెడ్జ్ ఎకానమీ'కి చంద్రబాబు పునాదులు వేశారు. ఆయన పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టినప్పుడు దాన్ని 'ఒట్టిసీమ' అని ఎంతోమంది విమర్శించారు. కానీ, అదే పట్టిసీమ రూ.50 వేల కోట్ల సంపదను సృష్టించి విమర్శకుల నోళ్లు మూయించింది. దటీజ్ చంద్రబాబు" అంటూ ప్రశంసించారు. ఆయన నాయకత్వంలోనే రికార్డు స్థాయిలో హంద్రీ-నీవా జలాలను రాయలసీమకు తీసుకెళ్లామని గుర్తుచేశారు.

 

వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తన అనుభవాలను సరదాగా పంచుకున్నారు. "సింగపూర్ అధ్యయన పర్యటనకు వెళ్లినప్పుడు, తిరిగొచ్చాక చంద్రబాబు ఏం ప్రశ్నలు అడుగుతారోనన్న భయంతో ఏడు రోజుల పాటు క్రమం తప్పకుండా క్లాసులకు హాజరయ్యాం. నేను కాలేజీ రోజుల్లో కూడా ఇంత సీరియస్‌గా చదువుకోలేదు. సింగపూర్‌లో మాత్రం భుజాన బ్యాగ్ వేసుకుని సీరియస్ స్టూడెంట్‌లా క్లాసులు విన్నాను" అని నవ్వుతూ చెప్పారు. 

 

ఇదే సమయంలో చంద్రబాబు సాధించిన ఓ అసాధారణ విజయాన్ని ఆయన గుర్తుచేశారు. "విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం నిర్ణయం తీసుకుంటే, సీఎం చంద్రబాబు వారిని ఒప్పించి ఏకంగా రూ.11 వేల కోట్లకు పైగా నిధులు ఇప్పించారు. అంత పెద్ద నిర్ణయంలో ప్రధాని మనసును ఆయన ఎలా మార్చారో ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది" అని వ్యాఖ్యానించారు.

 

మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. "రాజకీయాల్లో 'రిఫార్మర్' అనే పదానికి నిజమైన నిర్వచనం సీఎం చంద్రబాబు. తాను రిలాక్స్ అవ్వకుండా నిరంతరం పనిచేయడమే కాకుండా, తన బృందం కూడా అదే స్ఫూర్తితో పనిచేయాలని ఆయన ఆశిస్తారు. అప్పుడే ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి రెండూ అందించగలమని ఆయన బలంగా నమ్ముతారు" అని తెలిపారు. మొత్తంగా ఈ విందు సమావేశం చంద్రబాబు నాయకత్వ పటిమ, పాలనలో ఆయనదైన మార్క్‌ను మరోసారి చాటిచెప్పింది.

Search
Categories
Read More
SURAKSHA
B. Lakshmi Kantham, IAS: Championing Good Governance Excellence
B. Lakshmi Kantham, IAS: A Distinguished Civil Servant Committed to Transforming Governance A...
By Lokeshwari Panthadi 2026-07-13 13:33:39 0 185
Andhra Pradesh
నిమ్మలపల్లెలో ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.
చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు యువకులను...
By Pagadala Venkateswar 2026-05-04 05:55:34 0 96
Telangana
నిజామాబాద్:వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, ఇందూరులో వికలాంగులకు ప్రత్యేక బ్యాటరీ వాహనl పాంపిని
ఈరోజు మహిళ, శిశు మరియు వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, ఇందూరులో వికలాంగులకు ప్రత్యేక బ్యాటరీ...
By Sadaq Sadaq 2026-05-01 14:55:50 0 151
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం లో ప్రత్యేక పూజలు
పుంగనూరు నియోజకవర్గంలోని పలు ఆలయాలలో గురువారం తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని విశేష...
By Kothuru Murali 2026-03-20 06:13:05 0 156
Andhra Pradesh
మాజీ భార్యపై దాడి కేసు: ముగ్గురికి రెండేళ్ల జైలు శిక్ష.
ఆస్తి కోసం మాజీ భార్య నీలిమ, ఆమె భర్త వెంకటేష్‌పై దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులకు...
By Pagadala Venkateswar 2026-04-08 05:42:52 0 140
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com